Afghanistan Crisis Live Updates: కాందహార్ చేరుకున్న ముల్లా అబ్దుల్ బరదార్ సహా 8 మంది తాలిబాన్‌ నాయకులు

దేశంలోని ప్రజలకు తాము క్షమాభిక్ష ప్రసాదిస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు యథావిధిగా విధుల్లో చేరాలని సూచించారు. ఇస్లామిక్ చట్టాల ప్రకారమే మహిళలకు హక్కులు వర్తిస్తాయని స్పష్టం చేశారు.

ABP DesamLast Updated: 18 Aug 2021 01:59 PM

Background

ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు కైవసం చేసుకోవడంతో దేశంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు ప్రాణ భయంతో భయాందోళనకు గురవుతున్నారు. విదేశాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తూ ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఈ క్రమంలో తాలిబన్లు కీలక ప్రకటన చేశారు. దేశంలోని ప్రజలకు తాము క్షమాభిక్ష ప్రసాదిస్తున్నామని...More

Afghanistan Taliban LIVE: కాబూల్‌లో తాలిబన్‌ లీడర్లతో ఆఫ్ఘనిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌ సమావేశం

తాలిబాన్ కమాండర్, హక్కానీ నెట్‌వర్క్ తీవ్రవాద గ్రూపు సీనియర్ నాయకుడు అనాస్ హక్కానీ, ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌ని కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుపై కర్జాయ్‌తో చర్చించినట్టు TOLO న్యూస్‌ చెప్పింది.