Adilabad Rims Junior Doctors Ceased Protest: ఆదిలాబాద్ రిమ్స్ (Adilabad RIMS) లో మెడికోలు (Medicos) శనివారం సమ్మె విరమించారు. బయటి వ్యక్తులు తమపై దాడి చేశారని, వారిని కఠినంగా శిక్షించాలని గత 4 రోజులుగా వైద్య విద్యార్థులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రిమ్స్ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు (Junior Doctors) విధులు బహిష్కరించారు. డైరెక్టర్ ను మార్చాలని డిమాండ్ చేశారు. కాగా, శనివారం విచారణ కమిటీలు, వైద్య విద్యార్థులకు జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఈ క్రమంలో ఆందోళన విరమిస్తున్నట్లు మెడికోలు ప్రకటించారు. ముఖ్యంగా తమ 15 డిమాండ్లను నెరవేర్చాలని కమిటీ దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. భవిష్యత్తులో తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో తిరిగి ఆందోళన నిర్వహిస్తామని పేర్కొన్నారు.


ఇదీ జరిగింది






 

ఐదుగురి అరెస్ట్

 

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం కలిగించగా, వైద్య విద్యార్థులు విధులకు దూరంగా ఉంటూ ఆందోళన నిర్వహించారు. అత్యవసర సేవలకు తప్ప మిగిలిన సేవలకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. ఘటనపై విచారించిన పోలీసులు రిమ్స్ ప్రొఫెసర్ సహా ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. రిమ్స్ హాస్టల్ ఆవరణలోకి బయటి వ్యక్తులను తీసుకొచ్చి దాడి చేయించిన ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతి కుమార్ ను టర్మినేట్ చేశారు. ఈ క్రమంలో ఆందోళనలు కొనసాగుతుండగా, తాజాగా కమిటీలతో వైద్య విద్యార్థులు చర్చలు సఫలం కావడంతో నిరసన విరమించారు.




Also Read: Telangana News: 'ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలి' - బస్సుకు అడ్డంగా నిలబడి యువకుడి నిరసన, ఎక్కడంటే.?