Madhya Pradesh News: సమాజంలో నిత్యం ఏదొక వింత సంఘటనలను మనం చూస్తూనే ఉంటాం. వాటిని చూసినప్పుడు ఏంటీ ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోతుంటాం. ఇటీవల మధ్యప్రదేశ్ లో కూడా అలాంటి వింత సంఘటన ఒకటి వెలుగు చూసింది. పిల్లల కోసం ఓ వృద్దడు పెద్ద సాహసమే చేశాడు. 62 ఏళ్ల వయసులో మొదటి భార్య బతికి ఉండగానే ఓ అమ్మాయిను రెండో పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు ఓ ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యాడు కూడా. ఈ తతంగం అంతా ఆ వృద్దడి మొదట భార్యే చూసుకుందట. ఈ వింత ఘటన మధ్య ప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో చోటుచేసుకుంది. ఆ స్టోరీ ఏంటో మీరు కూడా  చూసేయండి.


ఆయనకు 62 ఆమెకు 30..


మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా అంతర్వేదియా ఖుర్ద్ గ్రామానికి చెందిన గోవింద్ కుష్వాహా తనకు 62 ఏళ్ల వయసులో హీరాబాయి(30) అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి పెళ్లి జరిగి దాదాపుగా ఆరేళ్లు అవుతుంది. కొన్ని నెలల క్రితం హీరాబాయి గర్భవతి అయింది. రెండ్రోజుల క్రితం ఆమెకు పురిటినొప్పులు రావడంతో ఆమెను దగ్గర్‌లో ఉన్న జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు అన్ని రకాల పరీక్షల అనంతరం ఆపరేషన్ నిర్వహించారు. అయితే హీరాబాయికు ఒకే కాన్పులో ముగ్గురు నవజాత శిశువులు జన్మించారు. అయితే సాధారణ ప్రసవం కంటే ముందే నొప్పులు రావడంతో ఆపరేషన్ చేశారు వైద్యులు. దీంతో పుట్టిన పిల్లలు బలహీనంగా ఉండటంతో ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. అయితే ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. 62 ఏళ్ల వయసులో పిల్లల కోసం ఆ వృద్దుడు చేసిన సాహసంపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. 


పిల్లల కోసమే రెండో పెళ్లి..


గోవింద్ కుష్వాహా కు ఇదివరకే పెళ్లి అయింది. ఆయన భార్య పేరు కస్తూరిబాయి.  ఆమె వయసు ప్రస్తుతం 60 ఏళ్లు ఉంటుంది. వీరికి పెళైన కొన్నేళ్లకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకును అల్లారుముద్దుగా పెంచుకుంటూ  వచ్చారు. కానీ ఆ అబ్బాయి తన 18 ఏళ్ల వయసులో రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. దీంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర దు:ఖంలో ఉండిపోయారు. కొన్నాళ్ల తర్వాత వారికి మళ్లీ పిల్లలు కావాలి అనిపించింది. కస్తూరిబాయితో ఆ వయసులో పిల్లలు కనడం కష్టమని భావించిన గోవింద్ హీరాబాయి అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలే వారికి ముగ్గురు సంతానం కలిగింది. తాను పిల్లల కోసమే రెండో పెళ్లి చేసుకున్నానని, ఇప్పుడు తమకు పుట్టిన పిల్లలు బలహీనంగా ఉన్నారని, త్వరగా పిల్లలు కోలుకోవాలని దేవున్ని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు గోవింద్. 


మొదటి భార్యే భర్తకు రెండో పెళ్లి చేసింది..


తమకు పుట్టిన కొడుకు 18 ఏళ్ల వయసులో చనిపోవడంతో మళ్లీ పిల్లల కోసం మొదటి భార్య కస్తూరిబాయి తన భర్తకు హీరాబాయి అనే అమ్మాయితో పెళ్లి చేయించింది. పిల్లల కోసమే ఈ వయసులో అలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు ఆ దంపతులు. తన భర్తతో హీరాబాయి(30) అనే అమ్మాయితో దగ్గరుండి మరీ పెళ్లి జరిపించింది. రెండో పెళ్లి జరిగిన ఆరు సంవత్సరాల తర్వాత హీరాబాయి తల్లైంది. ఇప్పుడు ఆమె ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.