13th BRICS Summit: మోదీ నేతృత్వంలో బ్రిక్స్ సమావేశం.. అఫ్గాన్ సంక్షోభంపై కీలక చర్చ
భారత్ నేతృత్వంలో నేడు బ్రిక్స్ సమావేశం జరిగింది. అఫ్గానిస్థాన్, కరోనా విపత్తు సహా మరిన్ని అంశాలపై సభ్య దేశాలు మాట్లాడాయి.
Continues below advertisement

బ్రిక్స్ సమావేశంలో అఫ్గాన్ పరిస్థితులపై చర్చ
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన 13వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం నేడు జరిగింది. కరోనా కారణంగా వర్చువల్ గా ఈ సమావేశం నిర్వహించారు. భారత్ అధ్యక్షత వహించడానికి సహకరించినందుకు సభ్య దేశాల అధినేతలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అఫ్గానిస్థాన్, కరోనా సహా పలు అంశాలపై సభ్య దేశాధినేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Continues below advertisement
రాబోయే 15 ఏళ్లలో బ్రిక్స్ కూటమి మరింత బలంగా మారాలి. ఈ ఏడాది సదస్సుకు నేతృత్వం వహించిన భారత్ ఇదే ఆకాంక్షిస్తోంది. బ్రిక్స్ సాధించిన ఘనతలు చూసి గర్విస్తున్నాను. బ్రిక్స్ కౌంటర్ టెర్రరిజం యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తాం - నరేంద్ర మోదీ, ప్రధాని
అంతా అమెరికా వల్లే..
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా, తన మిత్ర దేశాల బలగాలను ఉపసంహరించుకోవడం వల్ల కొత్త సంక్షోభం వచ్చింది. ఇది ఈ ప్రాంతం సహా ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై స్పష్టత లేదు. ఈ అంశంపై బ్రిక్స్ సభ్యదేశాలు దృష్టి సారించడం అభినందనీయం. ఉగ్రవాదం, డ్రగ్స్ సరఫరాకు అఫ్గానిస్థాన్ వేదిక కాకూడదు. సరిహద్దు దేశాలకు ముప్పుగా పరిణమించకూడదు. - వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు
ఈ భేటీలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోజా పాల్గొన్నారు.
Continues below advertisement