Patanjali’s Wellness Centre : మందులు, చికిత్సల ద్వారా నయం చేయలేని ఎన్నో వ్యాధులకు బాధపడుతున్న రోగులకు యోగా, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంతో కొత్త జీవితం లభిస్తోందని పతంజజలి పేర్కొంది. హరిద్వార్లోని వెల్నెస్ సెంటర్ ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పురుషులు, మహిళా రోగులకు పురాతన వైద్య విధానం అందిస్తూ.. మంచి ఫతితాలు అందుకుంటున్నట్లు పతంజలి చెప్తోంది. ఇది ఎంతవరకు నిజం? ప్రకృతి వైద్యంతో నిజంగానే మధుమేహం, మోకాళ్ల నొప్పులు వంటి దీర్ఘకాలిక సమస్యలు తగ్గుతున్నాయా? ఈ వెల్నెస్ సెంటర్లో ఇచ్చే వైద్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాన్సర్, కిడ్నీ సమస్య నుంచి విముక్తి!?
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన 63 ఏళ్ల రమా త్రివేది మాట్లాడుతూ.. "5 సంవత్సరాల క్రితం నాకు క్యాన్సర్ వచ్చింది. దీనికి అల్లోపతిలో చికిత్స లేదు. కానీ పతంజలి వెల్నెస్లో ఆయుర్వేద చికిత్స, యోగా, ప్రాణాయామం ద్వారా ఈ వ్యాధిని అదుపులోకి తెచ్చాను. క్యాన్సర్ నయమైంది." అని తెలిపారు. అలాగే "క్యాన్సర్ చికిత్స సమయంలో నా కిడ్నీలో సమస్యలు తలెత్తాయి. దీని కోసం నేను 5 సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వచ్చింది. కిడ్నీ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి, నేను ఇప్పుడు మళ్లీ పతంజలి వెల్నెస్లో చికిత్స తీసుకుంటున్నాను. నేను త్వరలో కోలుకుంటానని నమ్ముతున్నాను." అని తెలిపారు.న
74 ఏళ్ల వృద్ధుడికి కొత్త జీవితం - పతంజలి
"రాజస్థాన్లోని భరత్పూర్కి చెందిన 74 ఏళ్ల వేద్ ప్రకాష్కు కిడ్నీ క్యాన్సర్ వచ్చింది. దీని కారణంగా అతని పొత్తికడుపు ఎడమ వైపున నొప్పి ఉండేది. పరీక్షలో అతని కిడ్నీలో 80% దెబ్బతిన్నట్లు తేలింది. అతను క్యాన్సర్ చివరి దశలో ఉన్నాడు. ఆ తర్వాత పతంజలి వెల్నెస్లో జాయిన్ అయ్యాడు. ఇక్కడ యోగా, ఇతర మార్గాల ద్వారా చికిత్స అందించాము. ప్రతిరోజూ అతనిలో మెరుగుదల కనిపించింది. ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు." అంటూ పతంజలి తెలిపింది
మధుమేహం, మోకాళ్ల నొప్పులు మాయం
ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రకు చెందిన 50 ఏళ్ల అజయ్ ద్వివేది మధుమేహం, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందారని పతంజలి తెలిపింది. "అజయ్ ద్వివేది పతంజలి వెల్నెస్కు వచ్చినప్పుడు.. అతనిలో షుగర్ లెవెల్స్ 245 ఉంది. రక్తపోటు కూడా పెరిగింది. ఇక్కడి చికిత్స, ఆహారం, యోగా అతనిపై చాలా లోతైన ప్రభావాన్ని చూపించాయి. కొన్ని రోజుల్లోనే అతనిలో షుగర్ కంట్రోల్ అయింది. రక్తపోటు కూడా సాధారణ స్థితికి వచ్చింది." అని తెలిపారు.
ఇవి మాత్రమే కాదు. పతంజలి ద్వారా మోకాళ్ల నొప్పులు కూడా తగ్గాయని తెలిపింది. "హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాకు చెందిన 70 ఏళ్ల సరళా దేవి బంగాలియాకు 30 సంవత్సరాలుగా మోకాళ్ల నొప్పులు ఉన్నాయి. వివిధ ప్రదేశాలలో చికిత్స చేయించుకున్నా, వైద్యులు మోకాళ్ళను మార్చమని సలహా ఇచ్చినప్పటికీ.. ఆమెకు ఎటువంటి ఉపశమనం లభించలేదు. 2022లో పతంజలి వెల్నెస్లో చికిత్స చేయించుకున్న తర్వాత ఆమెకు 75% ఉపశమనం లభించింది. వైద్యులు సూచించిన చికిత్సను పూర్తిగా పాటించింది. ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉంది." అని తెలిపింది.
వ్యాధుల నుంచి విముక్తికి ఇచ్చే చికిత్సలు ఇవే
పతంజలి వెల్నెస్ కేంద్రాలలో రక్తపోటు, చక్కెర, క్యాన్సర్, ఆర్థరైటిస్, ఊబకాయం, కిడ్నీ, కాలేయ సమస్యలు వంటి నయం చేయలేని వ్యాధులకు యోగా, ఆయుర్వేదం, పంచకర్మ, నేచురోపతి, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ చికిత్స వంటి సమగ్ర ఆరోగ్య ప్యాకేజీని అందిస్తున్నట్లు తెలిపింది. సరైన పద్ధతిలో యోగా, ప్రాణాయామం, ఆహారం మరియు జీవనశైలిలో మార్పులపై దృష్టి పెడతమన్నది. అలాగే ఇక్కడి చికిత్స కేవలం వ్యాధి నివారణకు మాత్రమే కాదని.. ఇది జీవితంలో మార్పు తెచ్చే ప్రక్రియగా చెప్తోంది పతంజలి.