వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.  2021, 2022, 2023 సంవత్సరాల్లో ఇంజినీరంగ్ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక‌డ‌మిక్‌ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలున్నవారు జులై 31లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ పోస్టులకు రూ.9,000, టెక్నీషియన్ అప్రెంటిస్‌ పోస్టులకు  నుంచి రూ.8,000 స్టైపెండ్‌గా ఇస్తారు.

వివరాలు..

మొత్తం పోస్టులు : 250.

శిక్షణకాలం: ఏడాది.

1) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ: 200.

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, మెటలర్జీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, సెరామిక్స్.

అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్.

2)  టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ: 50.

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్, సివిల్, మైనింగ్, సిరామిక్స్, మెటలర్జి, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్.

అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా ఉండాలి. 2021, 2022, 2023 సంవత్సరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎలాంటి దరఖాస్తు ఫీజులేదు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: అక‌డ‌మిక్‌లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ద్వారా.

స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ పోస్టులకు రూ.9,000, టెక్నీషియన్ అప్రెంటిస్‌ పోస్టులకు  నుంచి రూ.8,000 స్టైపెండ్‌గా ఇస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 31.07.2023.

Notification

Online Application

Website

ALSO READ:

ఎన్‌ఐఓహెచ్‌ అహ్మదాబాద్‌లో 54 టెక్నికల్ పోస్టులు, వివరాలు ఇలా!గుజరాత్‌లోని అహ్మదాబాద్‌‌కు చెందిన ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్(ఎన్ఐఓహెచ్) టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, 12వ తరగతి, ఇంటర్‌, బీఈ, బీటెక్‌, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 04 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆయుష్‌ విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి రాష్ట్ర వైద్యారోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) జులై 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 156 మంది ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో54 ఆయుర్వేద, 33 హోమియో, 69 యునానీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 7 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 22లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో 184 అప్రెంటిస్‌ ఖాళీలు, అర్హతలివే!మధ్యప్రదేశ్‌ బాలాఘట్‌లోని హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌) ఆధ్వర్యంలో పనిచేస్తున్న మలాంజ్‌ఖండ్‌ కాపర్‌ ప్రాజెక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా ఇంటర్ అర్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే మైనింగ్ విభాగంలో పోస్టులకు ఇంటర్ అర్హత అవసరం లేదు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial