తెలంగాణలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టుల భర్తీకీ నిర్వహించనున్న కంప్యూటర్‌ ఆధారిత నియామక పరీక్షల (సీబీఆర్‌టీ) హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ సబ్జెక్టు, టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వేర్వేరు సబ్జెక్టు పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ప్రతి సబ్జెక్టు హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక అభ్యర్థి రెండు ఇంజినీరింగ్‌ సబ్జెక్టులకు దరఖాస్తులు చేస్తే.. ఆయా సబ్జెక్టుల పరీక్షలు జరిగే రెండు రోజులు జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1 పరీక్ష తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. అభ్యర్థులు సౌలభ్యం కోసం వెబ్‌సైట్‌లో మాక్‌టెస్ట్‌ను అందుబాటులో ఉంచినట్లు కమిషన్‌ వెల్లడించింది.


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 4 నుంచి 8 వరకు సబ్జెక్టులవారీగా పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1(జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 (అభ్యర్థుల సబ్జెక్టు) పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షల నిర్వహణ కోసం హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, హనుమకొండ, నిజామాబాద్‌లలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి లెవల్ 9ఎ- రూ.56,100- 1,77,500, లెవల్-10- రూ.57,700-1,82,400 మధ్య జీతాలు చెల్లిస్తారు. 


హాల్‌టికెట్ల కోసం క్లిక్  చేయండి..


పరీక్షల షెడ్యూలు ఇలా..



పరీక్షవిధానం
మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ 150 ప్రశ్నలు-150 మార్కులు (ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు), పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు 300 మార్కులు (ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు) ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయించారు. పేపర్-1 ఇంగ్లిష్, తెలుగులో; పేపర్-2 ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.



తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్  విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 247 పోస్టులను భర్తీ చేయనున్నారు. 19 సబ్జెక్టుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. జనవరి 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ) అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


ఆగస్టు 30 నుంచి ఏపీ పాలిసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
ఏపీలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీట్ల భర్తీకి సంబంధించి 'పాలిసెట్‌-2023' తుది విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆగస్టు 30 నుంచి ప్రారంభంకానుంది. సెప్టెంబరు 4 వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 1 వరకు ఫీజు చెల్లించవచ్చు. అవే తేదీల్లో సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహిస్తారు. సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయినవారు ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి సెప్టెంబరు 4న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత కళాశాలలో సెప్టెంబరు 7లోపు చేరాల్సి ఉంటుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


TSPSC: గ్రూప్‌-4 ప్రిలిమినరీ కీ విడుదల.. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లు
తెలంగాణలో 'గ్రూప్‌-4' ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్ 'కీ'ని టీఎస్‌పీఎస్సీ సోమవారం (ఆగస్టు 28) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. గ్రూప్-4 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ చూసుకోవచ్చు. ఆన్సర్ కీలో అభ్యంతరాలు తెలియజేసేందుకు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్‌ 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించింది. ప్రిలిమినరీ కీతోపాటు అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లు, మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్‌ను కూడా వెబ్‌సైట్‌లో కమిషన్‌ అందుబాటులో ఉంచింది. సెప్టెంబర్‌ 27 వరకు అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లు అందుబాటులో ఉంటాయని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..