తెలంగాణ జ్యుడీషియల్ మినిస్ట్రీస్ సర్వీస్‌లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న నియామక పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు రాతపరీక్ష షెడ్యూలును హైకోర్టు రిజిస్ట్రార్ విడుదల చేశారు. ప్రకటించిన షెడ్యూలు జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏప్రిల్ 3 నుంచి 5 వరకు రాతపరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో పోస్టులవారీగా నిర్ణీత షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 


ఆయా తేదీల్లో మూడు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు మొదటి షిఫ్టులో, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2 గంటల వరకు రెండో షిఫ్టులో, సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు మూడో షిఫ్టులో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను మార్చి 23 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  


పరీక్షల షెడ్యూలు ఇలా..


➥ ఏప్రిల్ 3న నిర్వహించే పరీక్షలు... 


జూనియర్ అసిస్టెంట్ (క్లస్టర్-3): ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు.


జూనియర్ అసిస్టెంట్ (క్లస్టర్-1): మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2 గంటల వరకు.


జూనియర్ అసిస్టెంట్ (క్లస్టర్-2): సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు.


➥ ఏప్రిల్ 4న నిర్వహించే పరీక్షలు... 


రికార్డ్ అసిస్టెంట్ (క్లస్టర్-2): 04.04.2023 - ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు.


రికార్డ్ అసిస్టెంట్ (క్లస్టర్-1): 04.04.2023 - మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2 గంటల వరకు. 


ఎగ్జామినర్: సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు.


➥ ఏప్రిల్ 5న నిర్వహించే పరీక్షలు... 


ఫీల్డ్ అసిస్టెంట్: ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు.




ALso Read:


UPSC EPFO Recruitment: ఈపీఎఫ్‌వోలో 577 ఖాళీలు, పూర్తి వివరాలు ఇలా!
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 577 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఐడీబీఐ బ్యాంకులో 600 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు, అర్హతలివే!
ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) అసిస్టెంట్ మేనేజనర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 600 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 17 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఏదైనా డిగ్రీతోపాటు నిర్ణీత పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 28లోపు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


ఐడీబీఐ బ్యాంకులో స్పెషలిస్ట్‌ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 114 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 21 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు మార్చి 3 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...