న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ప్రధాన కార్యాలయం దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాలు/ఆసుపత్రుల్లో 1038 పారామెడికల్‌ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈసీజీ టెక్నీషియన్, జూనియర్ రేడియోగ్రాఫర్, జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ తదితర పారామెడికల్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల దరఖాస్తు గడువు నేటితో(అక్టోబరు 30) ముగియ‌నుంది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల‌ను బ‌ట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఇంట‌ర్, డిప్లొమా, సర్టిఫికేట్, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రిజిస్ట్రేష‌న్ ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబ‌ర్ 30 వ‌ర‌కు దరఖాస్తు చేసుకోవ‌చ్చు. రాత పరీక్ష, టైపింగ్, డేటా ఎంట్రీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.


వివరాలు..


* మొత్తం పోస్టుల సంఖ్య: 1,038


పోస్టులు..


➦ ఈసీజీ టెక్నీషియన్


➦ జూనియర్ రేడియోగ్రాఫర్


➦ జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్


➦ మెడికల్ రికార్డ్ అసిస్టెంట్


➦ ఓటీ అసిస్టెంట్


➦ ఫార్మసిస్ట్


➦ రేడియోగ్రాఫర్


➦ సోషల్ గైడ్/ సోషల్ వర్కర్ 


ALSO READ: ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో 56 అనలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి


రీజియన్లవారీగా ఖాళీలు..


➥ బిహార్: 64


➥ చండీగఢ్, పంజాబ్: 32


➥ ఛత్తీస్‌గఢ్: 23


➥ ఢిల్లీ ఎన్‌సీఆర్‌: 27


➥ గుజరాత్: 72


➥ హిమాచల్ ప్రదేశ్: 06


➥ జమ్ము అండ్‌ కశ్మీర్: 09


➥ ఝార్ఖండ్: 17


కర్ణాటక: 57


➥ కేరళ: 12


➥ మధ్యప్రదేశ్: 13


➥ మహారాష్ట్ర: 71


➥ నార్త్ ఈస్ట్: 13


 ➥ ఒడిశా: 28


➥ రాజస్థాన్: 125


➥ తమిళనాడు: 56


➥ తెలంగాణ: 70


➥ ఉత్తర్‌ ప్రదేశ్: 44


➥ ఉత్తరాఖండ్: 09


➥ పశ్చిమ్‌ బెంగాల్: 42


ALSO READ: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌-2023 'టైర్‌-2' అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?


అర్హత: పోస్టులకు అనుగుణంగా పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, సర్టిఫికేట్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: పోస్టులవారీగా వయోపరిమితి నిర్ణయించారు. 30.10.2023 నాటికి నిర్ణీత వయసు కలిగి ఉండాలి. కొన్ని పోస్టులకు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. మరికొన్ని పోస్టులకు 32  సంవత్సరాలు, కొన్ని పోస్టులకు 37 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3-8 సంవత్సరాలు, సంస్థ ఉద్యోగులకు 40-45 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 


దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: రాత పరీక్ష, టైపింగ్/ డేటా ఎంట్రీ టెస్ట్ (పోస్టుకు అవసరమైతే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 


రాత పరీక్ష విధానం: మొత్తం 100 ప్రశ్నలకుగాను 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో టెక్నికల్/ ప్రొఫెషనల్ నాలెడ్జ్-50 ప్రశ్నలు-100 మార్కులు, జనరల్ అవేర్‌నెస్-10 ప్రశ్నలు-10 మార్కులు, జనరల్ఇంటెలిజెన్స్-20 ప్రశ్నలు- 20 మార్కులు, అరిథ్‌మెటిక్ ఎబిలిటీ-20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు.


ముఖ్యమైన తేదీలు...


➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01.10.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.10.2023.


Notification


Online Application


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...