ఒక ఉద్యోగి ఒకే సమయంలో ఒకటికి మించి ఉద్యోగాలు చేసే విధానం ‘మూన్‌లైటింగ్’ను వ్యతిరేకిస్తున్న దేశీయ ఐటీ దిగ్గజాల జాబితాలో టీసీఎస్ (TCS) కూడా చేరింది. రెగ్యులర్ ఉద్యోగానికి వెలుపల ప్రాజెక్టులు చేపట్టడాన్ని కంపెనీ తీవ్రంగా తప్పుబట్టింది. ఒక కంపెనీలో ఉద్యోగ ఒప్పందం కుదుర్చుకున్నాక వేరే సంస్థ కోసం పనిచేయడానికి అనుమతి ఉండదని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేష్ గోపినాథన్  స్పష్టం చేశారు.


మూన్‌లైటింగ్ ఒక ‘నైతిక సమస్య’ అని వ్యాఖ్యానించారు. టీసీఎస్ మూల విలువలు, సాంప్రదాయాలకు ఇది విరుద్ధమని ఉద్యోగులను ఆయన హెచ్చరించారు. కాగా మూన్‌లైటింగ్‌‌కు పాల్పడుతున్న ఉద్యోగుల తొలగింపు లేదా చర్యలపై కంపెనీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇప్పటివరకు అలాంటి చర్యలేమీ తీసుకోలేదని టీసీఎస్ హెచ్ఆర్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. మూన్‌లైటింగ్‌పై యాజమాన్యం అభిప్రాయం ఏంటో ఇదివరకే ఉద్యోగులకు తెలియజేశామని ప్రస్తావించారు.


:: Also Read ::  ఈస్టర్న్ రైల్వేలో 3115 అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!



కాగా గత కొన్ని వారాలుగా దేశీయ ఐటీ రంగంలో మూన్‌లైటింగ్ హాట్ టాపిక్‌గా మారిపోయింది. మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్న 300 మంది ఉద్యోగులను విప్రో తొలగించిన విషయం తెలిసిందే. మరో టెక్ దిగ్గజం ఐబీఎం కూడా మూన్‌లైటింగ్‌ను అనైతిక విధానంగా పేర్కొంది. కంపెనీలో చేరేముందు ఉద్యోగులు కేవలం ఐబీఎంకి మాత్రమే పనిచేస్తామనే ఒప్పందంపై సంతకం చేస్తారని ఐబీఎం ఇండియా, సౌత్ ఏసియా ఎండీ సందీప్ పటేల్ తెలిపారు.


ఇన్ఫోసిస్ కూడా ఇప్పటికే ఉద్యోగులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. కరోనా సంక్షోభం కారణంగా ఐటీ రంగంలో వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ ట్రెండ్‌ మొదలైంది. కొందరు ఐటీ ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం ఏకకాలంలో రెండు ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు. ఈ సబ్జెట్‌పై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఐటీ పరిశ్రమ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.


:: Also Read ::  సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌-హైదరాబాద్‌లో టెక్నీషియన్ పోస్టులు, అర్హతలివే!



ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఆగస్టు నెల ప్రారంభంలో తన ఉద్యోగులు మరో ప్రాజెక్టులో పనిచేసేందుకు కూడా అనుమతి ఇవ్వడంతో ఈ మూన్‌లైటింగ్ ప్రధానాంశంగా మారింది. ఈ విషయంపై ఐటీ ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.



IT Jobs:
ఫ్రెష‌ర్స్‌కు షాకిస్తున్న ఐటీ దిగ్గజాలు, ఆఫ‌ర్ లెట‌ర్లపై యూట‌ర్న్‌!


ఐటీ దిగ్గజ సంస్థలైన విప్రో, ఇన్ఫోసిస్‌, టెక్ మ‌హీంద్ర వంటి సంస్థ ఫ్రెష‌ర్లకు షాకిస్తున్నాయి. ఉద్యోగ ఆఫ‌ర్ లెట‌ర్లు ఇచ్చిన త‌ర్వాత అదిగో..ఇదిగో అంటూ నియామ‌క ప్రక్రియ‌లో జాప్యం చేసిన టెక్ సంస్థలు తాజాగా యూట‌ర్న్ తీసుకున్నాయి. ఫ్రెష‌ర్స్‌కు ఇచ్చిన ఆఫ‌ర్ లెట‌ర్లను వెనక్కు తీసుకుంటున్నాయి. నెల‌ల త‌ర‌బ‌డి నియామ‌క ప్రక్రియ‌పై ముందుకు కదలని ఐటీ కంపెనీలు ఫ్రెషర్స్‌కు ఇచ్చిన ఆఫ‌ర్ లెట‌ర్లను తిర‌స్కరిస్తున్నట్లు తెలుస్తోంది.


మూడు, నాలుగు నెల‌ల కింద‌ట తాము ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మ‌హీంద్ర వంటి టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నామ‌ని, ప‌లు రౌండ్ల ఇంట‌ర్వ్యూల త‌ర్వాత త‌మ‌కు ఆఫ‌ర్ లెట‌ర్లు ఇవ్వగా తామిప్పుడు కంపెనీల్లో చేరేందుకు వేచిచూస్తున్నామ‌ని విద్యార్ధులు చెబుతున్నారు. కాగా త‌మ ఆఫ‌ర్ లెట‌ర్లను ర‌ద్దు చేశామ‌ని త‌మ‌కు ఆయా కంపెనీల నుంచి లెట‌ర్స్ వ‌చ్చాయ‌ని వారు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. అర్హతా నిబంధ‌న‌లు, కంపెనీ మార్గద‌ర్శకాల పేరుతో ఆఫ‌ర్ లెట‌ర్లను ర‌ద్దు చేస్తున్నట్లుగా ఆయా కంపెనీలు చెబుతున్నాయ‌ని ఎంపికైన అభ్యర్థులు వాపోతున్నారు.



:: Also
Read ::
 హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో ఇంజినీరింగ్ ఉద్యోగాలు, ఈ అర్హత తప్పనిసరి!



అంత‌ర్జాతీయంగా ఐటీ రంగంలో మంద‌గ‌మ‌నం, వ్యయ నియంత్రణ చ‌ర్యలు చేప‌డుత‌న్న నేప‌ధ్యంలో ఈ ప‌రిణామాలు చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం. వ‌డ్డీరేట్ల పెంపు, మార్కెట్ల‌లో లిక్విడిటీ త‌గ్గుద‌ల‌, మాంద్యం ప‌రిస్ధితుల‌తో టెక్ స్టార్టప్‌ల నుంచి టెక్ దిగ్గజాల వ‌ర‌కూ ఐటీ కంపెనీలు గ‌డ్డు ప‌రిస్ధితులు ఎదుర్కొంటున్నాయి. ప్రతికూల ప‌రిస్ధితుల‌తో ప‌లు కంపెనీలు నియామ‌కాల‌ను నిలిపివేశాయి. గూగుల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్ధలు సైతం హైరింగ్‌ను నిలిపివేయ‌డంతో పాటు అవ‌స‌ర‌మైతే లేఆఫ్స్ త‌ప్పవ‌నే సంకేతాల‌ను పంపడం ఆందోళ‌న రేకెత్తిస్తోంది.


 


:: Also Read ::



❂  UPSC Notification: 'కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2023' నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టులెన్నో తెలుసా?



ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, అర్హతలివే!


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...