కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి సంబంధించిన పేపర్-2 పరీక్ష తేదీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం పేపర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి 26న పేపర్-2 పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. పేపర్-2 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాత దశంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక ఫలితాలు ప్రకటిస్తారు.


మొత్తం 300 మార్కులకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో మొత్తం 3 విభాగాలు ఉంటాయి. పార్ట్-ఎ సివిల్ & స్ట్రక్చరల్ ఇంజినీరింగ్, పార్ట్-బి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, పార్ట్-సి మెకానికల్ ఇంజినీరింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. స‌ంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా/ఇంజినీరింగ్‌ సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు సివిల్ ఏదో ఒక విభాగంలో ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 2 గంట‌ల‌ు. పేపర్‌-2 పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో కాకుండా ప్రతి ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలకు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు.


Paper-2 Syllabus



కేంద్ర ప్రభుత్వంలోని 21 విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, క్వాంటిటీ సర్వేయింగ్ & కాంట్రాక్ట్స్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో నవంబరు 14 నుంచి 16 వరకు పేపర్-1 పరీక్ష నిర్వహించారు. పేపర్-1 పరీక్ష ఆన్సర్ కీని నవంబరు 24న విడుదల చేశారు. ఆన్సర్ కీపై నవంబరు 26 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. అయితే పేపర్-1 పరీక్ష ఫలితాలను ఇప్పటివరకు వెల్లడించలేదు. ఫలితాలను జనవరి 23న విడుదల చేసే అవకాశం ఉంది. పేపర్-1లో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించే పేపర్-2 పరీక్ష తేదీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా వెల్లడించింది.  


Also Read:


1904 కోర్టు ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణ హైకోర్టు  జిల్లా కోర్టులతో పాటు హైదరాబాద్‌లోని వివిధ న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. వీటిద్వారా  మొత్తం 1,904 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల్లో ఆఫీస్ సబార్డినేట్-1226, జూనియర్ అసిస్టెంట్-275,  ప్రాసెస్ సర్వర్-163, రికార్డ్ అసిస్టెంట్-97, ఫీల్డ్ అసిస్టెంట్-77, ఎగ్జామినర్-66 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి జనవరి 11 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.  పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 31 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు.  
నోటిఫికేషన్లు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


హైకోర్టులో 176 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు, జనవరి 21 నుంచి దరఖాస్తులు!
తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. మొత్తం 176 ఖాళీల భర్తీకి 9 నోటిఫికేషన్లను హైకోర్టు విడుదల చేసింది. ఈ ఖాళీల భర్తీకి జనవరి 21 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఫిబ్రవరి 20 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. పరీక్ష తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 
పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...