విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌ డైరెక్ట్/ డిప్యూటేషన్ ప్రాతిపదికన పలు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 14 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తును నోటిఫికేషన్‌ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తుచేసుకోవచ్చు. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 14


➥ అసిస్టెంట్ రిజిస్ట్రార్(ఫైనాన్స్): 01 


➥ జూనియర్ సూపరింటెండెంట్: 01 


➥ గ్రాఫిక్ డిజైనర్/ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 01 


➥ వర్క్‌షాప్ సూపర్‌వైజర్/ సూపరింటెండెంట్: 01 


➥ జూనియర్ అసిస్టెంట్: 09 


➥ హాస్టల్ అసిస్టెంట్/ కేర్‌టేకర్: 01 


అర్హత: పోస్టును అనుసరించి 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


దరఖాస్తుకు చివరితేదీ: ఆన్‌లైన్ దరఖాస్తును నోటిఫికేషన్‌ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తుచేసుకోవచ్చు.


 హార్డ్ కాపీలు పంపాల్సిన చిరునామా: 
The Registrar,
School of Planning and Architecture, Vijayawada.
Survey No.4/4, ITI Road,Vijayawada-520008,
Andhra Pradesh, India.


Notification


Application Form 


Website



Also Read:


ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 400 ఉద్యోగాలు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. మార్చి 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్‌ ఇండియాలో 73 ఉద్యోగాలు - వివరాలు ఇలా!
బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్) గువాహటిలోని ఎయిమ్స్‌లో పనిచేయడానికి ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 73  పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10వ తరగతి/ 10+2/ ఇంటర్మీడియట్/ బీఈ/ బీటెక్/బీఎస్సీ/ గ్రాడ్యుయేషన్/ డిప్లొమా/ డీఎంఎల్‌టీ/ ఎంసీఏ/ ఎంఎస్సీ/ ఎంఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 21 వరకుఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. ‌స్కిల్‌టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ముంబయి పోర్ట్‌ అథారిటీలో ప్రాజెక్ట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు - వివరాలు ఇలా!
ముంబయి పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 7 వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/గ్రాడ్యుయేషన్/ఎంబీఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈపోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అబ్యర్థులు ఏప్రిల్ 6 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...