ఎస్‌బీఐ పీవో-2023 ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులను 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. పీవో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్/రోల్ నెంబర్, పాస్‌వర్డ్/పుట్టినతేది వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు పొందవచ్చు. నవంబరు 6 వరకు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉండనున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 1, 4, 6 తేదీల్లో పీవో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు.


హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి సెప్టెంబరు 6న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి సెప్టెంబరు 7 నుంచి అక్టోబరు 3 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తాజాగా ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఎస్‌బీఐ విడుదల చేసింది.


ప్రిలిమినరీ పరీక్ష విధానం..
మొత్తం 100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. మూడు విభాగాల నుంచి మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతిప్రశ్నకు ఒకమార్కు. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు-30 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-35 ప్రశ్నలు-35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పుడు సమాధానానికి ¼ వంతు మార్కులు కోత విధిస్తారు.


తెలుగు రాష్ట్రాల్లో ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్లు/ ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖమ్మం, కరీంనగర్, వరంగల్.


మెయిన్ పరీక్ష విధానం:
మొత్తం 250 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో, 50 మార్కులకు డిస్క్రిప్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలో రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 40 ప్రశ్నలు-50 మార్కులు, డేటా అనాలసిస్ & ఇంటర్‌ప్రిటేషన్ నుంచి 30 ప్రశ్నలు -40 మార్కులు, జనరల్ ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు-60 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 35 ప్రశ్నలు-40 మార్కులు ఉంటాయి. ఇక డిస్క్రిప్టివ్ పేపర్‌లో లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ పశ్నలకు 50 మార్కులు ఉంటాయి.


తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.


సైకోమెట్రిక్ టెస్ట్:
అభ్యర్థుల పర్సనాలిటి ప్రొఫైల్‌ను అంచనా వేయడానికి సైకోమెట్రిక్ పరీక్ష నిర్వహిస్తారు. మొతం 50 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో గ్రూప్ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 30 మార్కులు ఉంటాయి.


తుది ఎంపిక ఇలా:
మొత్తం 300 మార్కులకు తుది ఎంపిక కోసం నిర్ణయించారు. ఇందులో అభ్యర్థులు మెయిన్ పరీక్షలో సాధించిన మార్కులు; గ్రూప్ ఎక్సర్‌సైజ్‌, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. మెయిన్ ఎగ్జామ్‌కు 250 మార్కుల, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 50 మార్కులు ఉంటాయి. ఇక అభ్యర్థుల నార్మలైజ్డ్ మార్కులను మెయిన్ పరీక్షకు 75గా, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 25 మార్కులుగా నిర్ణయించారు.


ముఖ్యమైన తేదీలు...


➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సవరణ తేదీలు: 07.09.2023 నుంచి 27.09.2023 వరకు.


➥ దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 07.09.2023 నుంచి 27.09.2023 వరకు. (03.10.2023 వరకు పొడిగించారు)


➥ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2023, అక్టోబర్‌ రెండో వారంలో ప్రారంభం.


➥ స్టేజ్‌ 1- ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష: నవంబర్‌ 2023.


➥ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన: నవంబర్‌, డిసెంబర్ 2023.


➥ మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: నవంబర్‌/ డిసెంబర్‌ 2023.


➥ స్టేజ్‌ 2- ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్‌: డిసెంబర్‌ 2023/ జనవరి 2024.


➥ ప్రధాన పరీక్ష ఫలితాల ప్రకటన: డిసెంబర్‌ 2023/ జనవరి 2024.


➥ ఫేజ్ 3 కాల్ లెటర్ డౌన్‌లోడ్: జనవరి/ ఫిబ్రవరి 2024.


➥ ఫేజ్ 3- సైకోమెట్రిక్ పరీక్ష: జనవరి/ ఫిబ్రవరి 2024.


➥ ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌ తేదీలు: జనవరి/ ఫిబ్రవరి 2024.


➥ తుది ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి/ మార్చి 2024.


➥  ప్రీఎగ్జామినేషన్ ట్రైనింగ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2023, అక్టోబరు మొదటివారం నుంచి.


➥  ప్రీఎగ్జామినేషన్ ట్రైనింగ్ నిర్వహణ: 2023, అక్టోబరు రెండోవారం నుంచి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..