SBI PO 2023 Final Results: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి సంబంధించిన తుదిఫలితాలు మార్చి 19న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఎస్‌బీఐ పీవో మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు జనవరి 16 నుంచి గ్రూప్ డిస్కషన్, జనవరి 21 నుంచి నిర్వహించిన ఇంటర్వ్యూలలో అర్హత సాధించి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఎస్‌బీఐ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.41,960 (బేసిక్ పే) జీతంగా ఇస్తారు.


SBI PO Fnal Results చూసుకోండిలా..


➥ అభ్యర్థులు ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి. -sbi.co.in 


➥ అక్కడ హోమ్ పేజీలో కెరీర్స్ (Careers) ట్యాబ్‍పై క్లిక్ చేయాలి.


➥ అక్కడ కనిపించే 'SBI PO Final Results 2023' లింక్ మీద క్లిక్ చేయాలి. 


➥ తర్వాత పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న ఫలితాల జాబితా ఓపెన్ అవుతుంది.


➥  స్క్రీన్ మీద ఫలితాలు కనిపిస్తాయి. అభ్యర్థులు తమ రూల్ నెంబరు ఆధారంగా ఫలితాలు చూసుకోవచ్చు.


➥ భవిష్యత్తు అవసరాల కోసం ఫలితాల పేజీని డౌన్‍లోడ్ చేసుకొని.. ప్రింట్ అవుట్ తీసుకోవాలి.


SBI PO Final Results కోసం క్లిక్ చేయండి..


భారతదేశ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం 'స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా' ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 2,000 పీవో పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల దరఖాస్తు గడువు సెప్టెంబరు 7న ప్రారంభం కాగా.. దరఖాస్తు గడువును అక్టోబరు వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు నవంబరు 1, 4, 6 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను నవంబరు 21 విడుదల చేశారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబరు 5, 16 తేదీల్లో మెయిన్ పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన పీవో మెయిన్స్ పరీక్ష ఫలితాలు జనవరి 11న విడుదలయ్యాయి. పీడీఎఫ్ ఫార్మాట్‌లో మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ప్రకటించింది. ఫేజ్-3కి సంబంధించి సైకోమెట్రిక్ టెస్టుకు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ఎస్‌బీఐ జనవరి 11 ప్రకటించింది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులు గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు నిర్వహించారు. తాజాగా వీటి ఫలితాలను విడుదల చేశారు. 


సైకోమెట్రిక్ టెస్ట్: అభ్యర్థుల పర్సనాలిటి ప్రొఫైల్‌ను అంచనా వేయడానికి సైకోమెట్రిక్ పరీక్ష నిర్వహిస్తారు. మొతం 50 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో గ్రూప్ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 30 మార్కులు ఉంటాయి.


తుది ఎంపిక ఇలా:
మొత్తం 300 మార్కులకు తుది ఎంపిక కోసం నిర్ణయించారు. ఇందులో అభ్యర్థులు మెయిన్ పరీక్షలో సాధించిన మార్కులు; గ్రూప్ ఎక్సర్‌సైజ్‌, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. మెయిన్ ఎగ్జామ్‌కు 250 మార్కుల, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 50 మార్కులు ఉంటాయి. ఇక అభ్యర్థుల నార్మలైజ్డ్ మార్కులను మెయిన్ పరీక్షకు 75గా, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 25 మార్కులుగా నిర్ణయించారు.


నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..