ఆర్ఈసీ పవర్ డెవలప్‌మెంట్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్(ఆర్ఈసీ పీడీసీఎల్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 60 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 27వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 60


విభాగాలు: టెక్నాలజీ, యుటిలిటీ ఇంజినీర్, యూటిలిటీ కోఆర్డినేటర్, పవర్ సిస్టమ్ ఎక్స్‌పర్ట్ తదితరాలు.


1. ఎగ్జిక్యూటివ్(పవర్ సిస్టమ్ ఎక్స్‌పర్ట్: 01, ఐటీ ఎక్స్‌పర్ట్: 01): 02


అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.


పని అనుభవం: కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.


జీతభత్యాలు: నెలకు రూ.1,12,000/- చెల్లిస్తారు.


2. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్: 12


అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.


పని అనుభవం: కనీసం 06 ఏళ్లు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు.


జీతభత్యాలు:నెలకు రూ.85,000/-చెల్లిస్తారు.


3. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్: 46


అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.


పని అనుభవం: కనీసం 03 ఏళ్లు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.


జీతభత్యాలు: నెలకు రూ.62,000/-చెల్లిస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.


దరఖాస్తు చివరి తేది: 27.02.2023.


Notification 


Website 


Also Read:


యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!
'సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్)-2023' నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం (ఫిబ్రవరి 1) విడుదల చేసింది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ సర్వీసెస్‌ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేయనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 21 వరకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించినవారికి మెయిన్స్ పరీక్షలు నిర్వహించి తుది ఎంపికచేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో 193 పారామెడికల్, స్టైపెండరీ ట్రైనీ పోస్టులు - అర్హతలివే!
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తారాపూర్ మహారాష్ట్ర సైట్‌లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 193 పారామెడికల్, స్టైపెండరీ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది ఫిబ్రవరి 28గా నిర్ణయించారు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఏపీలోని కేంద్రీయ మైనార్టీ పాఠశాలల్లో 1428 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే?
కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలోని సీబీఎస్‌ఈ మైనార్టీ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి 'మహర్షి వేదవ్యాస్ ఔట్‌సోర్సింగ్ టీచర్స్ రిక్రూట్‌‌మెంట్' నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఏపీలోని 119 పాఠశాలల్లో 1428  టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో ఈ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...