APPSC Group 2 Recruitment: ఏపీలో గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమ్స్‌ (Group2 Prelims) పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పులేదని, షెడ్యూలు ప్రకారమే పరీక్ష జరుగుతుందని ఏపీపీఎస్సీ ప్రకటించింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. గ్రూప్-2 పోస్టులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 4.83 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మెయిన్స్‌ పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నారు. 


ఆంధ్రప్రదేశ్‌‌లో 899 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ(APPSC) డిసెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 పోస్టులకు సంబంధించి మొత్తం 899 ఖాళీల్లో.. 53 క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులకాగా, 846 తాజా ఖాళీలు ఉన్నాయి. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్(Excutive), 566 నాన్-ఎగ్జిక్యూటివ్(Non Excutive) పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల నుంచి డిసెంబరు 21 నుంచి జనవరి 17 వరకు దరఖాస్తులు స్వీకరించారు. గ్రూప్-2 పోస్టుల భర్తీని ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా భర్తీచేయనున్నారు. అభ్యర్థులకు ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించనున్నారు.


గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్ష తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. మెయిన్ రాత పరీక్షలో కనబరచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్ మోడ్(ఓఎంఆర్) ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతాయి. కొత్త సిలబస్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు. 


ప్రిలిమినరీ, మెయిన్ పరీక్ష విధానం:



వివరాలు..


* గ్రూప్-2 పోస్టులు


ఖాళీల సంఖ్య: 899


➥ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 333


➥ నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 566


అర్హత: డిగ్రీ, ఆపై విద్యార్హత ఉండాలి.


వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. కొన్ని పోస్టులకు 18-30 సంవత్సరాలు, కొన్ని పోస్టులకు 20-42 సంవత్సరాల మధ్య ఉండాలి. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.


దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుకింద రూ.250, పరీక్ష ఫీజు కింద రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, తెల్లరేషన్ కార్డు ఉన్నవారు, నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.80 నుంచి మినహాయింపు ఉంది. 


గ్రూప్-2 పోస్టుల అర్హతలు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి.. 


ALSO READ:


'గ్రూప్-1' ఉద్యోగాల భర్తీకి కసరత్తు, ఖాళీల వివరాలు సేకరణ - పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం!
తెలంగాణలో 'గ్రూప్-1' ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీఎస్‌పీఎస్సీ (TSPSC) కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు విభాగాల వారీగా అదనపు ఖాళీల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రంలో గత గ్రూప్-1 నోటిఫికేషన్‌లో మొత్తం 503 ఖాళీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టులకు అదనంగా మరిన్ని ఖాళీలు చేరే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా అదనంగా ఏర్పడిన ఖాళీలు, మరో ఏడాదిలో పదవీ విరమణతో ఏర్పడే ఖాళీలు గుర్తించి ప్రభుత్వానికి పంపిస్తున్నాయి. మరికొన్ని విభాగాలు కొంత సమయం కావాలని విజ్ఞప్తి చేశాయి. అదనంగా వచ్చే గ్రూప్-1 ఉద్యోగాల సంఖ్యపై వీలైనంత త్వరలో స్పష్టత రానుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి. . .