తమిళనాడులోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నైవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌ఎల్‌సీ) వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 294 పోస్టులను భర్తీచేయనుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 5 నుంచి ఆగస్టు 3 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.  

వివరాలు...

ఖాళీల సంఖ్య: 294

1) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: 31 పోస్టులువిభాగం: మెకానికల్-థర్మల్. 

2) డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌: 04 పోస్టులువిభాగం: మెకానికల్-థర్మల్. 

3) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: 63 పోస్టులువిభాగం: మెకానికల్- మైన్స్.

4) డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌: 01 పోస్టువిభాగం: మెకానికల్-రెనువబుల్ ఎనర్జీ. 

5) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: 33 పోస్టులువిభాగం: ఎలక్ట్రికల్ థర్మల్. 

6) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: 33 పోస్టులువిభాగం: ఎలక్ట్రికల్-మైన్స్. 

7) జనరల్‌ మేనేజర్‌: 01 పోస్టువిభాగం: మెకానికల్-రెనువబుల్ ఎనర్జీ. 

8) డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌: 02 పోస్టులువిభాగం: మెకానికల్-రెనువబుల్ ఎనర్జీ. 

9) డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌: 03 పోస్టులువిభాగం: సివిల్-థర్మల్. 

10) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: 20 పోస్టులువిభాగం: సివిల్ - మైన్స్.

11) డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌: 03 పోస్టులువిభాగం: సివిల్ - మైన్స్.

12) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: 06 పోస్టులువిభాగం: సివిల్-సర్వీసెస్. 

13) డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌: 01 పోస్టువిభాగం: సివిల్-సర్వీసెస్. 

14) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: 13 పోస్టులువిభాగం: కంట్రోల్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ (థర్మల్).

15) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: 04 పోస్టులువిభాగం: ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ (థర్మల్).

16) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: 04 పోస్టులువిభాగం: ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ (ప్రాజెక్ట్స్). 

17) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్: 03 పోస్టులువిభాగం: సైంటిఫిక్ (థర్మల్).

18) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్: 02 పోస్టులువిభాగం: సైంటిఫిక్ (మైన్స్).

19) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్: 01 పోస్టువిభాగం: సైంటిఫిక్ (ప్రాజెక్ట్స్).

20) మేనేజర్: 10 పోస్టులువిభాగం: జియోలజీ (మైన్స్).

21) డిప్యూటీ జనరల్ మేనేజర్: 02 పోస్టులువిభాగం: జియోలజీ (మైన్స్).

22) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: 18 పోస్టులువిభాగం: మైనింగ్.

23) డిప్యూటీ జనరల్ మేనేజర్: 04 పోస్టులువిభాగం: మైనింగ్.

24) జనరల్ మేనేజర్: 02 పోస్టులువిభాగం: కమర్షియల్.

25) డిప్యూటీ జనరల్ మేనేజర్: 01 పోస్టువిభాగం: కమర్షియల్.

26) అడిషనల్ చీఫ్ మేనేజర్: 08 పోస్టులువిభాగం: ఫైనాన్స్.

27) డిప్యూటీ జనరల్ మేనేజర్: 06 పోస్టులువిభాగం: ఫైనాన్స్.

28)  డిప్యూటీ జనరల్ మేనేజర్: 01 పోస్టువిభాగం: సెక్రటేరియల్.

29) డిప్యూటీ మేనేజర్: 06 పోస్టులువిభాగం: హెచ్‌ఆర్. 

30) మేనేజర్: 06 పోస్టులువిభాగం: హెచ్‌ఆర్.

31) డిప్యూటీ జనరల్ మేనేజర్: 04 పోస్టులువిభాగం: హెచ్‌ఆర్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.854. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.354 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా. ఇంటర్వ్యూ అర్హత మార్కులను జనరల్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50 శాతంగా, ఎస్సీ-ఎస్టీ-బీసీ-దివ్యాంగులకు 40 శాతంగా నిర్ణయించారు.

జీతభత్యాలు:  ➥ జనరల్‌ మేనేజర్‌: నెలకు రూ.1.2 లక్షలు - రూ.2.8 లక్షలు చెల్లిస్తారు.

➥ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌: నెలకు రూ.1 లక్ష - రూ.2.6 లక్షల వరకు చెల్లిస్తారు.

➥ అడిషనల్‌ చీఫ్‌ మేనేజర్: నెలకు రూ.90,000 - రూ.2.4 లక్షల వరకు చెల్లిస్తారు.

➥ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌: నెలకు రూ.70,000 - రూ.2 లక్షల వరకు చెల్లిస్తారు. 

➥ మేనేజర్‌: నెలకు రూ.70,000 - రూ.2 లక్షల వరకు చెల్లిస్తారు.

➥ డిప్యూటీ మేనేజర్‌: నెలకు రూ.60,000 - రూ.1.8 లక్షల వరకు చెల్లిస్తారు.

➥ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌: నెలకు రూ.50,000 - రూ.1.6 లక్షల వరకు చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.07.2023 (10:00 hrs)

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 03.08.2023 (17.00 hrs)

➥ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 03.08.2023 (23:45 hrs)

➥ గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తుకు చివరితేది: 04.08.2023 (17.00 Hrs)

Notification

Online Application

ALSO READ:

రెప్కో మైక్రో ఫైనాన్స్‌ లిమిటెడ్‌లో 140 ఖాళీలు, అర్హతలివే!చెన్నైలోని నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలోని 'రెప్కో మైక్రో ఫైనాన్స్‌ లిమిటెడ్‌' వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 140 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సీనియర్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అడ్మిన్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జులై 19లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

'టెన్త్' అర్హతతో 1558 ఉద్యోగాలు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది!మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూన్ 30న విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్రప్రభుత్వ విభాగాల్లో 1558 మ‌ల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్), హవిల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జూన్ 30 ఆన్‌‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 21లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial