నేవల్ షిప్ రిపేర్ యార్డ్ (కార్వార్,కర్ణాటక), నేవల్ ఎయిర్‌క్రాఫ్ట్ రిపేర్ యార్డ్ (గోవా) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా 210 అప్రింటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నేషనల్ అప్రెంటిస్‌షిప్ వెబ్‌ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక ఉంటుంది.


వివరాలు..


* అప్రెంటిస్ పోస్టులు


ఖాళీల సంఖ్య 210


 ➥ నేవల్ షిప్ రిపేర్ యార్డ్: 180 పోస్టులు


 ➥ నేవల్ ఎయిర్‌క్రాఫ్ట్ రిపేర్ యార్డ్: 30 పోస్టులు


ట్రేడ్లు: కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఐటీ & కమ్యూనికేషన్ టెక్నాలజీ మెయింటెనెన్స్/ఐటీ & ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ మెయింటెనెన్స్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, మెకానిక్ మోటార్ వెహికిల్, మెకానిక్ రిఫ్రిజిరేట్ & ఏసీ, పెయింటర్, ప్లంబర్, షీట్ మెటల్ వర్కర్, సీవింగ్ టెక్నాలజీ/డ్రెస్ మేకింగ్, వెల్డర్, రిగ్గర్.


అర్హత: కనీసం 50 శాతం మార్కుతో పదోతరగతి, 65 శాతం మార్కులతో సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉండాలి. రిగ్గర్ పోస్టులకు 8వ తరగతి అర్హత సరిపోతుంది. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు, కంటిచూపు కలిగి ఉండాలి.


వయోపరిమితి: 15.04.2024 నాటికి 14-21 సంవత్సరాల మధ్య ఉండాలి. 14.04.2010 - 15.04.2023 మధ్య జన్మించి jఉండాలి. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా.


స్టైపెండ్: రిగ్గర్ (ఫ్రెషర్) పోస్టులకు రూ.2500, రూ.5000, రూ.5500 ఇస్తారు. ఏడాది ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నవారికి రూ.7700, రెండేళ్ల ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నవారికి రూ.8050 స్టైపెండ్‌గా ఇస్తారు.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: ఉద్యోగ ప్రకటన ఎంప్లాయ్‌‌మెంట్ న్యూస్ పత్రికలో ప్రచురితమైననాటి నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తులు సమర్పించాలి.


Notification


Website


ALSO READ:


ఇండియన్ ఆర్మీలో 'టెక్నికల్ ఎంట్రీ స్కీమ్' దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
ఇండియన్ ఆర్మీలో జులై-2024లో ప్రారంభమయ్యే 51వ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(టీఈఎస్) కోర్సు శిక్షణలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 90 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్‌ బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌) లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ(మెయిన్స్)-2023లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 13న ప్రారంభంకాగా.. నవంబరు 12 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇంటెలిజెన్స్ బ్యూరోలో 677 ఉద్యోగాల దరఖాస్తులు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
కేంద్ర హోంవ్యవహారాల మంత్రిత్వ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో  677 సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 14న ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన వారు నవంబరు 13 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరతగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. అలాగే ప్రాంతీయ భాషలో నైపుణ్యం ఉండాలి.  అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, మహిళా అభ్యర్థులు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. టైర్-1, టైర్-2 రాతపరీక్షల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. 
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..