ముంబయిలోని ఐఆర్ఈఎల్(ఇండియా) లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 14 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్‌, బీకామ్‌, సీఏ, సీఎంఏ, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా  జులై 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 14


⏩ చీఫ్‌ మేనేజర్‌(ఫైనాన్స్): 01


⏩ సీనియర్‌ మేనేజర్‌(ఫైనాన్స్): 03


⏩ మేనేజర్‌(ఫైనాన్స్): 01


⏩ అసిస్టెంట్‌ మేనేజర్‌(ఫైనాన్స్): 03


⏩ సీనియర్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌ఎం): 01


⏩ అసిస్టెంట్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌ఎం): 02


⏩ మేనేజర్‌(మైనింగ్): 02


⏩ మేనేజర్‌(క్వాలిటీ కంట్రోల్): 01


అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్‌, బీకామ్‌, సీఏ, సీఎంఏ, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి:  28-42 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ.500. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ/ సైకోమెట్రిక్‌ టెస్ట్‌/ గ్రూప్‌ కాంబినేషన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


జీతభత్యాలు: నెలకు రూ.40000-రూ.2.2లక్షచెల్లిస్తారు.


ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 12.07.2023.


Notification


Website 


ALSO READ:


ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 239 టీచింగ్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ(టీఎస్‌ఈఎస్‌) 2023-24 విద్యా సంత్సరానికి రాష్ట్రంలోని 23 ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బోధనతో పాటు రెసిడెన్షియల్‌ పాఠశాల విధులకు హాజరుకావడం తప్పనిసరి. షేరింగ్‌ ప్రాతిపదికన బోర్డింగ్‌, లాడ్జింగ్‌ పాఠశాల క్యాంపస్‌లో అందుబాటులో ఉండేలా సదుపాయం ఉంటుంది. ఎంపికైన ఉపాధ్యాయులు సీబీఎస్‌ఈ సిలబస్‌ను ఆంగ్లభాషలో బోధించాల్సి ఉంటుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు జులై 02వ తేదీలోగా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


నవోదయ విద్యాలయాల్లో 7,629 టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు, వివరాలు ఇలా!
నవోదయ విద్యాలయ సమితి టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 7,629 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో పీజీటీ, టీజీటీ టీచింగ్ పోస్టులతోపాటు, పలు విభాగాల్లో నాన్-టీచింగ్ పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. జులై మొదటివారంలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ (అవసరమైన పోస్టులకు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


కాకినాడ జీజీహెచ్‌లో 97 స్టాఫ్ నర్స్ పోస్టులు, వివరాలు ఇలా!
కాకినాడలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 97 పోస్టులను భర్తీ చేయనున్నారు. జీఎన్‌ఎం, బీఎస్సీ(నర్సింగ్), ఎంఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సంబంధిత చిరునామాలో సమర్పి్ంచాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పటికి జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..