Indian Army SSC Tech Recruitment: ఇంజినీరింగ్‌ అర్హతతో ఇండియన్ ఆర్మీలో కొలువులకు నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ)లో 379 టెక్నికల్ పోస్టులను భర్తీచేయనున్నారు. మొత్తం ఖాళీల్లో పురుషులకు 350, మహిళలకు 29 పోస్టులను కేటాయించారు. వివాహంకాని పురుష, మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. వీటిల్లో అర్హత సాధించినవారికి  ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత పీజీ డిప్లొమా అందుకుని, లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుంది. ఇండియన్‌ ఆర్మీ ద్వారా ఏటా రెండుసార్లు టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఉద్యోగాలకు ఎంపికైనవారికి సీటీసీ రూపంలో ఏడాదికి రూ.18 లక్షలు వేతనంగా ఇస్తారు. 


వివరాలు..


* షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ టెక్నికల్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 379 (మెన్-350, ఉమెన్-29) 


విద్యార్హత: సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఇంజినీరింగ్ చివరి సెమిస్టర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కంప్యూటర్‌ సైన్స్‌ విభాగానికి బీటెక్‌ (ఐటీ)తోపాటు ఎంఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ చదివినవారూ అర్హులే. 


వయోపరిమితి: 01.10.2025 నాటికి 20 నుంచి  27 సంవత్సరాలలోపు ఉండాలి. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ, తెలంగాణ అభ్యర్థులకు బెంగళూరులో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వీరికి సైకాలజిస్ట్, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తారు. మొత్తం రెండు దశల్లో 5 రోజులపాటు ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఇందులో భాగంగా మొదటిరోజు నిర్వహించే స్టేజ్‌-1లో ఉత్తీర్ణులైనవారికి తర్వాతి 4 రోజులు నిర్వహించే స్టేజ్‌-2 ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇందులోనూ విజయవంతమైనవారికి మెడికల్ టెస్టులు నిర్వహించి, తుదిఎంపిక చేస్తారు.


 


శిక్షణ వివరాలు..


➥ ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో అక్టోబరు నెల నుంచి శిక్షణ ప్రారంభంకానుంది. మొత్తం 49 వారాలపాటు శిక్షణ కొనసాగనుంది.


➥ శిక్షణ విజయవంతంగా పూర్తిచేసినవారికి మద్రాస్‌ యూనివర్సిటీ పీజీ డిప్లొమా ఇన్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ డిగ్రీని ప్రదానంచేస్తారు.


➥ ఆ తర్వాత వీరిని లెఫ్టినెంట్‌ హోదాలో విధుల్లోకి తీసుకుంటారు. విధుల్లో చేరినవారు పదేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు. అనంతరం సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని శాశ్వత విధుల్లోకి (పర్మనెంట్‌ కమిషన్‌) తీసుకుంటారు. మిగిలినవారికి మరో నాలుగేళ్లపాటు సర్వీస్‌ పొడిగిస్తారు.


➥ లెఫ్టినెంట్‌ విధుల్లో చేరినవారు 2 సంవత్సరాల అనుభవంతో కెప్టెన్, 6 సంవత్సరాల సేవలతో మేజర్, 13 సంవత్సరాలు కొనసాగితే లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాకు చేరుకునే అవకాశం ఉంటుంది. మొదటి నెల నుంచే అన్నీ అలవెన్సులు కలిపి దాదాపు రూ.1.5 లక్షల వరకు వేతనం పొందవచ్చు. 


స్టైపెండ్, వేతనం: అభ్యర్థులకు శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్‌‌గా చెల్లిస్తారు. ఆ తర్వాత హోదాలను బట్టి రూ.2,50,000 వరకు వేతనం ఉంటుంది.


ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 05.02.2025. 


Notification


Online Application


Website  


ALSO READ:


యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..