ఐబీపీఎస్ పీవో మెయిన్ పరీక్ష అడ్మిట్ కార్డును ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించి, మెయిన్ పరీక్షలకు రాయనున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్/రోల్ నెంబర్ లేదా పాస్‌వర్డ్/పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. షెడ్యూలు ప్రకారం అక్టోబరు 1న పీవో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష తేదీ వరకు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉండనున్నాయి.


అడ్మిట్ కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

1) అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. - https://www.ibps.in/

2) అక్కడ హోంపేజీలో కనిపించే '' IBPS RRB Main Exam Call letter Download'' లింక్ మీద క్లిక్ చేయాలి.

3) క్లిక్ చేయగానే కనిపించే ఫలితాల లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేది వివరాలను నమోదుచేయాలి.

4) కంప్యూటర్ తెర మీద పీవో పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డు కనిపిస్తుంది.

5) అభ్యర్థులు అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం జాగ్రత్తపచుకోవాలి.

6) పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష రోజు అడ్మిట్ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డుతోపాటు ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. 


IBPS RRB PO 2022 Mains Admit Card 


 


Also Read:   NABARD Jobs: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, వెంటనే దరఖాస్తు చేసుకోండి


దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 8106 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ఆఫీస్‌ అసిస్టెంట్‌-4483 పోస్టులు, ఆఫీసర్‌ స్కేల్‌ I -2676 పోస్టులు, ఆఫీసర్‌ స్కేల్‌ II - 867 పోస్టులు, ఆఫీసర్‌ స్కేల్‌ III - 80 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 7, 13, 14, తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఆఫీస్‌ అసిస్టెంట్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను సెప్టెంబరు 8న విడుదల చేయగా.. ఆఫీసర్ స్కేల్-1 ఫలితాలను సెప్టెంబరు 14న విడుదల చేశారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 1న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.


Also Read:   SAIL: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 200 ఖాళీలు, అర్హతలివే!

మెయిన్ పరీక్ష విధానం:
మెయిన్స్‌ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో రీజనింగ్: 40 ప్రశ్నలు-50 మార్కులు, కంప్యూటర్  నాలెడ్జ్: 40 ప్రశ్నలు-50 మార్కులు , జనరల్ అవేర్‌నెస్: 40 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్/హిందీ లాంగ్వేజ్: 40 ప్రశ్నలు-40 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: 40 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి.
Also Read:


 SSC CGL Notification:  కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌ నోటిఫికేషన్ విడుదల!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి,  గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే  'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2022'  నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.  ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  మూడంచెల  (టైర్-1,టైర్-2,  టైర్-3)  పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 
నోటిఫికేషన్ , దరఖాస్తు వివరాల  కోసం  క్లిక్ చేయండి...


Also Read:


UPSC: ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2023 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా!
న్యూఢిల్లీ ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలకు నియామకాలు చేపడతారు. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...