గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యా్ర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 17లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

వివరాలు..

పోస్టుల సంఖ్య: 11

➥ చీఫ్‌ జనరల్‌ మేనేజర్ (హెచ్‌ఆర్ & ఎ): 01

➥ అడిషనల్‌ జనరల్‌ మేనేజర్ (హెచ్‌ఆర్): 01 

➥ సీనియర్‌ మేనేజర్ (అడ్మిన్): 01

➥ సీనియర్‌ మేనేజర్ (టెక్నికల్): 02

➥ మేనేజర్ (మెకానికల్): 02

➥ మేనేజర్ (టెక్నికల్): 01 

➥ చీఫ్‌ జనరల్‌ మేనేజర్ (టెక్నికల్): 02

➥ డిప్యూటీ జనరల్‌ మేనేజర్ (కోఆర్డినేషన్): 01

విభాగాలు: హెచ్‌ఆర్, అడ్మిన్, మెకానికల్, టెక్నికల్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్‌/బీఈ/ఎంబీఏ /ఎంఎస్‌డబ్ల్యూ/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

వయోపరిమితి: 31.08.2023 నాటికి 36 నుంచి 54 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.

వేతనం: నెలకు రూ.60,000 నుంచి రూ.2.8 లక్షలు చెల్లిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 17.10.2023.

Notification

Online Application

Website

ALSO READ:

ఎన్‌ఐఈ, చెన్నైలో 47 టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులుచెన్నైలోని ఐసీఎంఆర్‌- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 47 టెక్నికల్, ల్యాబొరేటరీ పోస్టులను భర్తీచేయనున్నారు. ప్రస్తుతానికి ఉద్యోగ ప్రకటన మాత్రమే సంస్థ వెల్లడించింది. ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి. టెక్నికల్ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.35,400 - రూ.1,12,400. ల్యాబొరేటరీ అటెండెంట్‌ పోస్టులకు రూ.18,000 - 56,900 వరకు జీతం చెల్లిస్తారు.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

బీఈఎంఎల్‌ బెంగళూరులో 119 గ్రూప్ సి పోస్టులు, వివరాలు ఇలాబెంగుళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న బీఈఎంఎల్ తయారీ యూనిట్లు/ మార్కెటింగ్ విభాగాల్లో గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 119 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్ఠోమర్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఎయిమ్స్‌-కళ్యాణిలో 120 గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టులు - వివరాలు ఇలాపశ్చిమబెంగాల్‌లోని కళ్యాణిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. స్కిల్‌టెస్ట్‌/ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..