కాకినాడలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం‌, నేషనల్ హెల్త్ మిషన్(అర్బన్) ఒప్పంద ప్రాతిపదికన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 7 పోస్టులను భర్తీ చేయనున్నారు. ‌ఎంబీబీఎస్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 13 నుంచి మార్చి 16 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.


వివరాలు..


* మెడికల్ ఆఫీసర్


మొత్తం ఖాళీలు: ‌07 పోస్టులు


అర్హత: ‌ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి. అభ్యర్థులు దరఖాస్తులను కాకినాడలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయంలో వ్యక్తిగతంగా అందజేయాలి.


ఎంపిక విధానం: మెరిట్‌ కమ్‌ రోస్టెరాస్‌ పెర్రూల్స్‌ ఇన్‌ఫోర్స్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా: 
DM & HO Office, 
Kakinada,
East Godavari District.
Andhra Pradesh


ముఖ్యమైనతేదీలు..


➥ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: 13.03.2023.


➥ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 16.03.2023.


➥ తుది ఎంపిక జాబితా విడుదల‌: 20.03.2023.


➥ నియామక ఉత్తర్వుల జారీ: 22.03.2023.


Notification & Application Form


Website



Also Read:


ఎస్‌బీఐలో 868 ఉద్యోగాలు, వీరు మాత్రమే అర్హులు! ఎంపికైతే నెలకు రూ.40 వేల జీతం!
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన భారతీయ స్టేట్‌ బ్యాంక్‌, రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్‌ (RBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 868 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. వీటిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అమరావతి పరిధిలో 39 పోస్టులు, హైదరాబాద్‌ పరిధిలో 48 పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారిని బిజినెస్ కరస్పాండెంట్ ఫెసిలిటేటర్ పోస్టుల్లో నియమించనుంది. బ్యాంకింగ్‌లో అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 10న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మార్చి 31తో గడువు ముగియనుంది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్‌ ఇండియాలో 73 ఉద్యోగాలు - వివరాలు ఇలా!
బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్) గువాహటిలోని ఎయిమ్స్‌లో పనిచేయడానికి ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 73  పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10వ తరగతి/ 10+2/ ఇంటర్మీడియట్/ బీఈ/ బీటెక్/బీఎస్సీ/ గ్రాడ్యుయేషన్/ డిప్లొమా/ డీఎంఎల్‌టీ/ ఎంసీఏ/ ఎంఎస్సీ/ ఎంఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 21 వరకుఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. ‌స్కిల్‌టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ముంబయి పోర్ట్‌ అథారిటీలో ప్రాజెక్ట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు - వివరాలు ఇలా!
ముంబయి పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 7 వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/గ్రాడ్యుయేషన్/ఎంబీఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈపోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అబ్యర్థులు ఏప్రిల్ 6 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...