బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(బీఎంఆర్‌సీఎల్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 68 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టునిఅనుసరించి బీఈ/ బీటెక్/ ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

వివరాలు..

మొత్తం ఖాళీలు: 68

పోస్టుల వారీగా ఖాళీలు..

1. డిప్యూటీ చీఫ్ ఇంజనీర్: 3

2. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్: 10

3. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్: 17

4. అసిస్టెంట్ ఇంజనీర్: 38

విభాగాలు: సిస్టమ్స్ కాంట్రాక్ట్, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ & ఏఎఫ్‌సీ, రోలింగ్ స్టాక్, ట్రాక్షన్ & ఆర్‌ఎస్‌ఎస్, ఈ&ఎమ్, ఈ&ఎమ్ డిపో సహా. లిఫ్టులు మరియు ఎస్కలేటర్, ఈసీఎస్ & టీవీఎస్/ స్కాడా, ఆపరేషన్ సేఫ్టీ, కాంట్రాక్ట్‌, డిపో మెషినరీ & ప్లాంట్.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత.

వయోపరిమితి: 40-55 సంవత్సరాలు ఉండాలి.

జీతభత్యాలు:⦁ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్: నెలకు రూ.1.4లక్షలు చెల్లిస్తారు.⦁ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్: నెలకు రూ.85000 చెల్లిస్తారు.⦁ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్: నెలకు రూ.65000 చెల్లిస్తారు.⦁ అసిస్టెంట్ ఇంజనీర్: నెలకు రూ.50000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

చిరునామా: General Manager (HR), Bangalore Metro Rail Corporation Limited, III Floor, BMTC Complex, K.H. Road, Shanthinagar, Bengaluru 560 027.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 17.04.2023.

Notification 

Website 

Also Read:

పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో 138 ఇంజినీర్‌ ట్రెయినీ ఖాళీలు- అర్హతలివే!పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 138 ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఈపీఎఫ్‌వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా!న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశ వ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఈపీఎఫ్‌వో- రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 2674 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌లో టైపింగ్ స్పీడ్‌గా చేయగలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 5000 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 106 ఖాళీలు, ఏపీలో 141 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికచేస్తారు.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...