Bank of Baroda Vacancies: ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంఎస్‌ఎంఈ (BOB MSME) విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 250 సీనియర్ మేనేజర్ (Senior Manager) పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ లేదా పీజీ అర్హతతోపాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 6న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. డిసెంబరు 26 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్‌లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష, ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.63,840 - రూ.78,230 వరకు జీతం ఇస్తారు.


వివరాలు..


* సీనియర్ మేనేజర్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 250.


పోస్టుల కేటాయింపు: యూఆర్(జనరల్)-103, ఈడబ్ల్యూఎస్-25, ఓబీసీ-67, ఎస్టీ-18, ఎస్సీ-37. వీటిలో దివ్యాంగులకు 10 పోస్టులు కేటాయించారు.


విభాగం: ఎంఎస్‌ఎంఈ రిలేషన్‌షిప్‌ - ఎంఎంజీ/ఎస్‌-III.


అర్హత: కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ/ ఎంబీఏ(మార్కెటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


అనుభవం: డిగ్రీ అర్హతతో 8 సంవత్సరాలు, పీజీ డిగ్రీ/ ఎంబీఏ అర్హత ఉన్నవారికి 6 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఏదైనా బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ లేదా ఫైనాన్షియల్ సంస్థలో ఎంఎస్‌ఎంఈ బ్యాంకింగ్ అనుభవం ఉండాలి. 


వయోపరిమితి: 01.12.2023 నాటికి 28 - 37 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు 5-10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష, ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆధారంగా.


పరీక్ష విధానం: మొత్తం 225 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీజనింగ్ 25 ప్రశ్నలు-25 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు-25 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు-25 మార్కులు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ 75 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో అర్హత మార్కులను జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 శాతంగా, ఇతరులకు 35 శాతంగా నిర్ణయించారు. 


పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, బరేలీ, బరోడా, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ/ఎన్‌సీఆర్, ఎర్నాకుళం, గువాహటి, హమీర్‌పూర్, హైదరాబాద్, జైపూర్, జలంధర్, జమ్మూ, కోల్‌కతా, లక్నో, ముంబయి, నాగ్‌పూర్, పనాజీ, పాట్నా, పుణే, రాయ్‌పూర్, విశాఖపట్నం.


జీతం: నెలకు రూ.63,840 - రూ.78,230.


ముఖ్యమైన తేదీలు...


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.12.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 26.12.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 26.12.2023.


Notification


Online Application


Website


ALSO READ:


ఎస్‌బీఐ క్లర్క్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?


ఐడీబీఐ బ్యాంకులో 86 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు, వివరాలు ఇలా


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...