ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-4 మెయిన్ పరీక్ష ప్రాథమిక ఆన్సర్ కీని ఏపీపీఎస్సీ ఏప్రిల్ 6న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. గ్రూప్-4 మెయిన్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ చూసుకోవచ్చు. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా ఏపీపీఎస్సీ అందుబాటులో ఉంచింది. 


ప్రాథమిక ఆన్సర్ కీపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలిపేందుకు ఏప్రిల్ 7 నుంచి 9 వరకు అవకాశం కల్పించింది. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అభ్యంతరాలు నమోదుచేయాల్సి ఉంటుంది. పోస్ట్, వాట్సాప్, ఎస్‌ఎంఎస్, ఫోన్, వ్యక్తిగతంగా సమర్పించడం తదితర రూపాల్లో సమర్పించే అభ్యంతరాలను స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్  కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 4న రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. 


General Studies & Mental ability


General English and General Telugu


రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి..


Also Read:


ఏప్రిల్‌ 10 నుంచి కోర్టు ఉద్యోగాల సర్టిఫికేట్ వెరిఫికేషన్! పోస్టులవారీగా షెడ్యూలు ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి రాతపరీక్షల ఫలితాలను మార్చి 29న వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. నియామక ప్రక్రియలో భాగంగా నాన్ టెక్నికల్ విభాగాల్లోని ఉద్యోగాలకు ఏప్రిల్ 10 నుంచి 24 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ హైకోర్టు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. అభ్యర్థులకు సంబంధిత జిల్లాల్లోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ కోర్ట్స్ పరిధిలో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులున్నందున ఖాళీలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కోర్టుల నుంచి ఖాళీలను అనుసరించి నిర్ణీత సమయంలో రెండో ఎంపిక జాబితా వెలువడనుంది. తదుపరి ఖాళీలను బట్టి అవసరమైతే, మూడో ఎంపిక జాబితా కూడా ప్రకటిస్తారు. టెక్నికల్ విభాగంలోని స్టెనో, టైపిస్టు, కాపీయిస్టు పోస్టులకు ఎంపికైన వారికి స్కిల్ టెస్టు, డ్రైవర్ పోస్టులకు ఎంపికైన వారికి డ్రైవింగ్ టెస్టు తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.
పోస్టులవారీగా షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2023 మెయిన్స్ పరీక్ష తేదీ ఖరారు, ఎప్పుడంటే?
ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2023 మెయిన్స్ పరీక్ష తేదీని యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ (యూపీఎస్సీ) ఖరారు చేసింది. పరీక్షను జూన్ 5న నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూన్ 25న రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 9 గంటల నుం మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డును పరీక్షకు కొన్నివారాలకు ముందు నుంచి అందుబాటులో ఉంచనున్నారు.
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - 69 పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ సంస్థల్లో పనిచేయుటకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా ఏప్రిల్ 13లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...