గ్రూప్-1 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. నాలుగేళ్ల క్రితం నిర్వహించిన పరీక్షలకు సంబంధించి అన్ని రకాల ప్రక్రియను పూర్తి చేసుకుని ఫలితాలు విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ ప్ర‌క‌టించింది. మొత్తంగా 167 పోస్టుల భర్తీకి 2018లో నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇందులో 165 స్థానాలను భర్తీ చేసినట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది. మరో రెండు స్థానాలను స్పోర్ట్స్ కోటా కోసం రిజర్వ్ చేశారు. 


డిప్యూటీ కలెక్టర్లు-30, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్-08, డీఎస్పీలు-27, డీఎస్సీ(జైళ్ల శాఖ)-1, డీఎఫ్ఓ-1, అసిస్టెంట్ ట్రెజరీ అధికారులు-11, ఆర్టీఓలు-5, అసిస్టెంట్ ప్రొహిబిషన్-మల్టీజోన్-1 - 06, మల్టీ జోన్-2-05, ఎంపీడీవోలు-47, జిల్లా రిజిస్ట్రార్లు-01, జిల్లా ఉపాధి కార్యాలయం-02, సహకార శాఖలో డెప్యూటీ రిజిస్ట్రార్స్- 01(జోన్-2), 01 (జోన్-3), జిల్లా గిరిజన అధికారి-01, ఎస్సీ సంక్షేమ అధికారి-01, బీసీ సంక్షేమ అధికారి-01, డీపీఓ-01,గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్లు-1,ఏపీ వైద్యారోగ్య పరిపాలన శాఖలో అడ్మినిస్ట్రేటీవ్ అధికారులు- మల్టీజోన్-1- 06,
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్-02 (జోన్-3), 04 (జోన్-4),భ‌ర్తి చేసిట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్ల‌డించారు.


గ్రూప్-1 పరీక్షల ఫలితాల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారని, నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం పరీక్షా ఫలితాలు రిలీజ్ చేస్తున్నామ‌న్నారు సవాంగ్. 167 పోస్టుల భర్తీకి లక్షన్నరకుపైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 325 మంది ఇంటర్వ్యూ వరకు వచ్చారు. కోర్టు తీర్పునకు లోబడి ఈ ఫలితాలు ఉంటాయని చెప్పారాయన.