అనంతపురంలోని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ విధానంలో వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు అక్టోబరు 21లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.


వివరాలు..


* పారామెడికల్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 56


➥ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2: 02 పోస్టులు


➥ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్‌ 2: 02 పోస్టులు


➥ రేడియోగ్రాఫర్: 01 పోస్టు


➥ థియేటర్ అసిస్టెంట్: 08 పోస్టులు


➥ ల్యాబ్ అటెండెంట్: 02 పోస్టులు


➥ పోస్ట్ మార్టం అసిస్టెంట్: 03 పోస్టులు 


➥ మెడికల్ రికార్డ్ అసిస్టెంట్/ రికార్డ్ అసిస్టెంట్: 02 పోస్టులు


➥ జనరల్ డ్యూటీ అటెండెంట్ జీడీఏ/ ఎంఎన్‌వో/ ఎఫ్‌ఎన్‌వో:  28 పోస్టులు


➥ ఆఫీస్ సబార్డినేట్: 01 పోస్టులు


 ➥ ప్లంబర్: 05 పోస్టులు


➥ ఎలక్ట్రీషియన్: 01 పోస్టులు


➥ ఆడియోమెట్రీషియన్/ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్: 01 పోస్టులు


అర్హతలు: పోస్టును అనుసరించి పదోతరగతి, ఐటీఐ, డీఫార్మసీ, బీఫార్మసీ, డీఎంఎల్‌టీ, నర్సింగ్ ఆర్డర్లీ కోర్సు, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 


వయోపరిమితి: 30.09.2024 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. 


దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీలు రూ.400 చెల్లించాలి. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.


ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Office of the District Coordinator of Hospital Services, 
Ananthapuramu District. 


దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 21.10.2023.


Notification & Application


Website


ALSO READ:


ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 496 పోస్టులని భర్తీ చేయనున్నారు. బీఎస్సీ (ఫిజిక్స్‌/ మ్యాథ్స్‌) లేదా ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల  అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబర్‌ 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. సీబీటీ, వాయిస్‌ టెస్ట్‌, సైకోయాక్టివ్‌ సబ్‌స్టాన్స్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇంటెలిజెన్స్ బ్యూరోలో 677 ఉద్యోగాల దరఖాస్తులు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
కేంద్ర హోంవ్యవహారాల మంత్రిత్వ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో  677 సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 14న ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన వారు నవంబరు 13 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరతగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. అలాగే ప్రాంతీయ భాషలో నైపుణ్యం ఉండాలి.  అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, మహిళా అభ్యర్థులు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. టైర్-1, టైర్-2 రాతపరీక్షల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. 
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..