ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్ల షెడ్యూలు పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఈ మేరకు ఆగస్టు 11న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగస్టు 25 నుంచి ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ) నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది.

ఫిజికల్ ఈవెంట్ల కోసం విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, ఏలూరులో వేదికలు ఏర్పాటు చేసినట్లు బోర్డు తెలిపింది. అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన కాల్‌ లెటర్లను ఆగస్టు 14 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు తప్పనిసరిగా తమ వెంట స్టేజ్‌-2 అప్లికేషన్‌ ఫాం తెచ్చుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. 

ఏపీలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (సివిల్‌) పోస్టులకు (పురుషులు, మహిళలు), రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (పురుషులు) పోస్టులకు సంబంధించి 411 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఎస్‌ఐ ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాతపరీక్షకు మొత్తం 1,51,288 మంది అభ్యర్థులు హాజరుకాగా.. వారిలో 57,923 మంది అభ్యర్థులు (38 శాతం) ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు. వీరిలో 49,386 మంది పురుషులు, 8537 మహిళలు ఉన్నారు. 

ఫిజికల్ ఈవెంట్ల కేంద్రాలు..

➥ విశాఖపట్నంలో కేంద్రంలో మొత్తం 17,371 మంది అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. వీరిలో 14,626 మంది పురుషులు, 2745 మంది మహిళలు ఉన్నారు. 

➥ ఏలూరు కేంద్రంలో మొత్తం 9,685 మంది అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. వీరిలో 8,246 మంది పురుషులు, 1439 మంది మహిళలు ఉన్నారు.

➥ గుంటూరు కేంద్రంలో మొత్తం 12,956 మంది అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. వీరిలో 11,047 మంది పురుషులు, 1909 మంది మహిళలు ఉన్నారు.

➥ కర్నూలు కేంద్రంలో మొత్తం 16,104 మంది అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. వీరిలో 14,007 మంది పురుషులు, 2097 మంది మహిళలు ఉన్నారు.

🔰 ఫిజికల్ ఈవెంట్లు ఇలా..

➨ సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు/లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.

➨ ఏపీఎస్‌సీ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.


ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్ పరీక్షలో అర్హత సాధించినవారికి ధ్రువపత్రాల పరిశీలన, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపికచేస్తారు.

🔰 మెయిన్ పరీక్ష విధానం: 

➨ ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.

➨  సివిల్ ఎస్‌ఐ పోస్టులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.

➨  ఏపీఎస్‌పీ ఎస్‌ఐ పోస్టులకు 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌కు కేటాయిస్తారు.

➨ ఇంగ్లిష్, తెలుగు, ఉర్డూ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.

పోస్టుల వివరాలు..

* సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టులు 

ఖాళీల సంఖ్య: 411

1) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) ఎస్‌ఐ- సివిల్ (మెన్/ఉమెన్): 315 పోస్టులు

జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..

జోన్ జిల్లా/ఏరియా పోస్టులు
జోన్-1 (విశాఖపట్నం) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 50
జోన్-2 (ఏలూరు) తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా 105
జోన్-3 (గుంటూరు) గుంటూరు, ప్రకాశం, నెల్లూరు 55
జోన్-4 (కర్నూలు) చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప 105
  మొత్తం  315

2) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్- ఏపీఎస్‌పీ (మెన్/ఉమెన్): 96 పోస్టులు

జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..

జిల్లా ఖాళీల సంఖ్య
ఎచ్చెర్ల- శ్రీకాకుళం  24
రాజమహేంద్రవరం 24
మద్దిపాడు - ప్రకాశం  24
చిత్తూరు 24
మొత్తం 96

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...