APPSC ADTP Notification: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ సర్వీసులో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 7 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఆర్క్/ బీఈ (సివిల్)/బీప్లానింగ్/ బీటెక్ (ప్లానింగ్)/ ఎంఏ (జియోగ్రఫీ)తోపాటు టౌన్ ప్లానింగ్ విభాగంలో పీజీ డిగ్రీ లేదా డిప్లొమా అర్హత కలిగి ఉండాలి. అర్హులైన అభ్యర్థులు మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 10 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.


అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ 120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు, తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. వీరు కేవలం ప్రాసెసింగ్ ఫీజు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన  ఆధారంగా ఎంపిక చేస్తారు. 


వివరాలు..


* అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులు


ఖాళీల సంఖ్య: 07.


పోస్టుల కేటాయింపు: ఓసీ-01, ఈడబ్ల్యూఎస్-01, ఎస్సీ-01, బీసీ-04.


అర్హత: బీఆర్క్/ బీఈ (సివిల్)/బీప్లానింగ్/ బీటెక్ (ప్లానింగ్)/ ఎంఏ (జియోగ్రఫీ)తోపాటు టౌన్ ప్లానింగ్ విభాగంలో పీజీ డిగ్రీ లేదా డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.


వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు, తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాలు; ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ 120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు, తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. వీరు కేవలం ప్రాసెసింగ్ ఫీజు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 


పరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాలపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ) 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2(టౌన్ ప్లానింగ్-1): 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2(టౌన్ ప్లానింగ్-2): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాలు కేటాయించారు.


ప్రాక్టికల్ పరీక్షలు: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ఫ్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ సంబంధిత ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్షలో అర్హత మార్కులను ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30గా, బీసీలకు 35గా, ఓసీలకుు 40 మార్కులుగా నిర్ణయించారు.


జీతం: నెలకు రూ.61,960 - రూ.1,51,370.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.03.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.04.2024 (11:59 PM).


Notification


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.