SSC Stenographer Recruitment Notification: కేంద్రప్రభుత్వ విభాగాల్లో స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) స్టెనోగ్రాఫ‌ర్ ఎగ్జామినేష‌న్ - 2024 నోటిఫికేషన్  విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో 2006 స్టెనోగ్రాఫ‌ర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టైపింగ్ తెలిసి ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు. దరఖాస్తు సమయంలో ఏమైనా సందేహాలుంటే టోల్‌ఫ్రీ నెంబరు-1800 309 3063 ద్వారా సంప్రదించవచ్చు.


వివరాలు..


* స్టెనోగ్రాఫ‌ర్ గ్రేడ్-సి, గ్రేడ్-డి ఎగ్జామినేషన్-2024


ఖాళీల సంఖ్య: 2006 పోస్టులు


అర్హత‌: 17.08.2024 నాటికి ఇంట‌ర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. స్టెనోగ్రఫీ తెలిసి ఉండాలి.


వయోపరిమితి: 


➥ 01.08.2024 నాటికి స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి) పోస్టులకు 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు  02.08.1994 - 01.08.2006 మధ్య జన్మించి ఉండాలి. ఇక స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-డి) పోస్టులకు 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 01.08.2024 - 02.08.1997 మధ్య జన్మించి ఉండాలి.


➥ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు కేటగిరీలవారీగా 10-13-15 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్, డిఫెన్స్ పర్సనల్ అభ్యర్థులకు 3 సంత్సరాలు, డిఫెన్స్ (డిసెబుల్డ్) పర్సనల్ ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 8 సంత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 


➥ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 40 సంవత్సరాల వరకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (ఎస్సీ, ఎస్టీ) 45 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 


➥ వితంతు-విడాకులు-ఒంటరి మహిళలకు 35 సంవత్సరాల వరకు, ఎస్సీ, ఎస్టీలకు 40 సంవత్సరాల వరకు వయోపరిమితి వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ (యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డు) ద్వారా ఫీజు చెల్లించాలి.


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


ఎంపిక‌ విధానం: ఆన్‌లైన్ రాతప‌రీక్ష, స్కిల్ టెస్ట్, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా.


పరీక్ష విధానం...


➥ మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 200 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.


➥ పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి.


➥ పరీక్ష సమయం 2 గంటలు. ప్రత్యేక అవసరాలుగల అభ్యర్థులకు 40 నిమిషాలు ఎక్కువ సమయం కేటాయిస్తారు.


➥ పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25  చొప్పున మార్కుల్లో కోత విధిస్తారు.


➥ పరీక్షలో కనీస అర్హత మార్కులను జనరల్ అభ్యర్థులకు 30 శాతంగా; ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 25 శాతంగా; ఇతరులకు 20 శాతంగా నిర్ణయించారు.



సదరన్ రీజియన్‌లో ప‌రీక్ష కేంద్రాలు: గుంటూరు, క‌ర్నూలు, రాజ‌మ‌హేంద్రవ‌రం, తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌, చెన్నై, సేలం, కోయంబ‌త్తూరు, మ‌ధురై, తిరుచిరాప‌ల్లి, తిరున‌ల్వేలి, పుదుచ్చేరి, హైద‌రాబాద్, వ‌రంగ‌ల్.


స్కిల్ టెస్ట్:



ముఖ్యమైన తేదీలు..


✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.07.2024.


✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 17.08.2024(23:00)


✦ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 18.08.2024 (23:00)


✦ దరఖాస్తుల తప్పుల సవరణ తేదీ: 27.08.2024 to 28.08.2024 (23:00 hours)


✦ ఆన్‌లైన్ రాతపరీక్ష: 2024, అక్టోబరు-నవంబరులో. 


Notification


Online Application


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...