న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న ఎయిర్‌ ఇండియా ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఏఐఏఎస్‌ఎల్‌) చెన్నై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 495 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 17 నుంచి 20 వరకు నిర్వహించే వాక్‌ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. 

వివరాలు..

మొత్తం ఖాళీలు: 495

పోస్టుల వారీగా ఖాళీలు..

1) కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: 80

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌/ డిప్లొమా ఉత్తీర్ణత. 

వయసు: 28 సంవత్సరాలకు మించకూడదు. 

జీతభత్యాలు: నెలకు రూ.25980 చెల్లిస్తారు.

2) జూనియర్‌ కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: 64

అర్హత: ఇంటర్/ డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయసు: 28 సంవత్సరాలకు మించకూడదు.  జీతభత్యాలు: నెలకు రూ.23,640 చెల్లిస్తారు.

3) ర్యాంప్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: 121

అర్హత: ఐటీఐ/ మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 28 సంవత్సరాలకు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.25980 చెల్లిస్తారు.

4) హ్యాండిమ్యాన్‌: 230

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

వయసు: 28 సంవత్సరాలకు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.23,640 చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.500.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది

ఇంటర్వ్యూ వేదిక: Office of the HRD Department, AI Unity Complex, Pallavaram Cantonment, Chennai -600043.

ఇంటర్వ్యూ తేది: 17, 18, 19, 20.04.2023.

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు.

Notification & Application

Website

Also Read:

ఈపీఎఫ్‌వోలో 185 స్టెనోగ్రాఫర్‌ పోస్టులు, అర్హతలు ఇవే!న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రెగ్యులర్ ప్రాతిపదికన స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 185 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ అర్హతతోపాటు, టైపింగ్ తెలిసి ఉండాలి. అర్హులైన అభ్యర్థులు మార్చి 27 నుంచి ఏప్రిల్ 26 మధ్య ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్ (టైపింగ్), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 5000 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 106 ఖాళీలు, ఏపీలో 141 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికచేస్తారు.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

ఎన్‌పీడీసీఎల్‌లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, అర్హతలివే!వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్‌పీడీసీఎల్‌)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైనవారికి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ సర్కిళ్ల పరిధిలో నియమిస్తారు. ఎంపిక విధానంలో తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆర్టీసియన్స్‌గా పనిచేస్తున్న వారికి 20 శాతం వెయిటేజీ వర్తిస్తుంది.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...