పాట్నాలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 45 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. మార్చి 20 వరకు దరఖాస్తుచేసుకోవచ్చు. మార్చి 24న పరీక్ష నిర్వహించి, 25న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.


వివరాలు..


* జూనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్) పోస్టులు


మొత్తం ఖాళీలు: 45


అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 10.03.2023 నాటికి 37 సంవత్సరాలు మించకూడదు.


దరఖాస్తు ఫీజు: రూ.1200. ఎస్సీ/ ఎస్టీలకు రూ.500, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేయాలి.


ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


పరీక్ష వేదిక: ఎగ్జామినేషన్ హాల్, అడ్మిన్.భవనం, ఎయిమ్స్‌ పాట్నా.


ఇంటర్వ్యూ వేదిక: కమిటీ హాల్, అడ్మిన్.భవనం, ఎయిమ్స్‌ పాట్నా.


జీత భత్యాలు: రూ.56,100.


ముఖ్యమైన తేదీలు..


🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.03.2023.


🔰 ఎయిమ్స్‌ పాట్నా వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డ్ విడుదల: 22.03.2023


🔰 పరీక్ష తేదీ: 24.03.2023.


🔰 పరీక్ష సమయం: ఉ.10:00 - 11:00.


🔰 ఇంటర్వ్యూ తేదీ: 25.03.2023.


🔰 ఇంటర్వ్యూ సమయం: ఉ.10.00


 


 


Notification 


Website 


Also Read:


బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1284 కానిస్టేబుల్ పోస్టులు, వివరాలు ఇలా!
భారత కేంద్రహోం మంత్రిత్వశాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 26న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 27 వరకు కొనసాగనుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ముంబయి పోర్ట్‌ అథారిటీలో ప్రాజెక్ట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు - వివరాలు ఇలా!
ముంబయి పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 7 వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/గ్రాడ్యుయేషన్/ఎంబీఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈపోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అబ్యర్థులు ఏప్రిల్ 6 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


BIMTECH: బిర్లా ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు, ఏడాదికి 15 లక్షల వరకు జీతం!
నోయిడాలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (బిమ్‌టెక్) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి పీహెచ్‌డీ/ఎఫ్‌పీఎం/ పీజీడీఎం/ ఎంబీఏ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి. ఒప్పంద ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...