బతిండాలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) గ్రూప్ ‘ఎ’, ‘బి’ & ‘సి’  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 35 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌, 10+2, బీఎస్సీ, గ్రాడ్యుయేషన్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 35


నర్సింగ్ ట్యూటర్/ క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్: 08


లైబ్రేరియన్‌ గ్రేడ్-III: 01 


హాస్టల్‌ వార్డెన్‌: 02 


ల్యాబొరేటరీ టెక్నీషియన్‌: 05


క్యాషియర్‌: 01


సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (UDC): 01


లేబొరేటరీ అటెండెంట్ గ్రేడ్-II: 04


హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్-III: 13


అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌, 10+2, బీఎస్సీ, గ్రాడ్యుయేషన్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.


పని అనుభవం: కనీసం 0-2 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 18-50 సంవత్సరాలు ఉండాలి.


దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.800.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు..


ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.08.2023.


ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 11.09.2023.


Notification


Website


ALSO READ:


ఎన్‌ఎస్‌యూటీ న్యూఢిల్లీలో 322 ఫ్యాకల్టీ పోస్టులు, అర్హతలివే!
NSUT Delhi Recruitment 2023: న్యూఢిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 322 ప్రొఫెసర్, అసిస్ట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 31 వరకు దరఖాస్తు హార్డుకాపీలను పంపించాలి. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌లో 105 జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌ ఖాళీలు
BARC JRF Notification: ముంబయిలోని భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్‌) జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీతోపాటు జూనియర్ రిసెర్చ్ కోసం అర్హత కల్పించే ఏదైనా పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 4న ప్రారంభంకాగా.. ఆగస్టు 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అకడమిక్ మార్కులు, జాతీయ స్థాయి అర్హత పరీక్షలో సాధించిన స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, ఖాళీల వివరాల కోసం క్లిక్ చేయండి..


భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్‌ కార్యాలయాలు/ యూనిట్లలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ, వెల్ఫేర్‌ ఆఫీసర్‌, జేఎం పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..