ఉదయాన్నే నిద్ర లేచి వేడి వేడి టీ - రస్కుల కాంబినేషన్ ఎంతో మందికి ఇష్టం. అలాగే సాయంత్రం కూడా చాలా మంది టీలో రస్కులు అద్దుకుని ఎంతో ఇష్టంగా లాగించేస్తారు. కానీ, ఈ వీడియో చూస్తే మాత్రం ఛీ అనుకుని... రస్కులు కొనడానికి, తినడానికి కూడా ఆలోచిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 


కొద్ది రోజుల క్రితం గువాహటిలో ఓ పానీ పూరీ అమ్మే వ్యక్తి తన యూరిన్‌ని పూరీని నింపేందుకు ఉపయోగించే వాటర్లో కలపడం చూసి అవాక్కయ్యాం. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్ అవ్వడంతో పోలీసులు కూడా సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి పానీ పూరీ అంటే ఇదే గుర్తొచ్చి కొన్ని రోజులు తినకుండా వాటికి దూరంగా ఉన్నాం.






ఇప్పుడు ఓ రస్కులు తయారు చేసే ఫ్యాక్టరీలో ప్యాకింగ్ చేసే వ్యక్తి ఆ రస్కులను నాలుకతో నాకి నాకి ప్యాకెట్లో పెట్టాడు. అంతకుముందు వర్కర్లు ప్యాక్ చేసే రస్కులపై ఇష్టానుసారంగా కాళ్లు వేయడం ఈ వీడియోలో చూస్తాం. ‘giedde’ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఈ వీడియో షేర్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ ఫ్యాక్టరీ ఎక్కడ? ఫుడ్ ఇన్ స్పెక్టర్లు ఏం చేస్తున్నారు?  అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్లని అరెస్టు చేయాలంటూ ఈ వీడియో పై సదరు యూజర్ రాసుకొచ్చాడు.