corona cases: ఏపీలో కొత్తగా మరో రెండు వేల కేసులు నమోదు

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశం ఇవాళ కొత్తగా 39,742 మందికి కరోనా సోకింది.

ABP Desam Last Updated: 25 Jul 2021 05:07 PM

Background

దేశంలో కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 39,742 మందికి వైరస్ సోకింది. 39వేల 972 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఈ వైరస్‌ కారణంగా 535 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసులు ౩కోట్ల 13లక్షల 71...More

ap corona cases: ఏపీలో కొత్తగా 2వేల 252 కరోనా కేసులు నమోదు

ఏపీ కొత్తగా 2,252 కరోనా కేసులు నమోదయ్యాయి.  15 మరణాలు రిజిస్టర్ అయ్యాయి. చికిత్స పొందుతూ 2,440 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసులు 22వేల155. ఏపీలో 24 గంటల్లో 84వేల 858 మందికి కరోనా పరీక్షలు చేస్తే రెండు వేల రెండు వందల యాభై రెండు కేసులు వెలుగు చూశాయి. 
జిల్లాల వారీగా చూసుకుంటే కేసుల నమోదు, మరణాల్లో చిత్తూరు మొదటి స్థానంలో ఉంది. చిత్తూరు జిల్లాలో 293, నెల్లూరు జిల్లాలో 239 కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 234, ప్రకాశం జిల్లాలో 223 కొత్తగా కరోనా కేసులు వెలుగు చూశాయి. చిత్తూరు జిల్లాలో నలుగురు మృతి చెందారు. గుంటూరు జిల్లాలో ముగ్గురు కరోనా బారిన పడి చనిపోయారు. కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.