India Corona Cases: కర్ణాటకలో లాక్‌డౌన్ విధిస్తారా.. క్లారిటీ ఇచ్చిన ఆర్థికశాఖ మంత్రి

దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా తగ్గాయి. 38,667 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనాతో పోరాడుతూ మరో 478 మంది మరణించారు.

ABP Desam Last Updated: 14 Aug 2021 11:23 AM

Background

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా తగ్గాయి. 22,29,798 మందికి కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 38,667 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది....More

బిగ్ రిలీఫ్... 3 అతిపెద్ద రాష్ట్రాల్లో కొవిడ్19 మరణాలు నిల్

అతిపెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో కరోనా తీవ్రత చాలా వరకు తగ్గింది. ఉత్తరప్రదేశ్‌లో కేవలం 25 కొవిడ్19 కేసులు నమోదు కాగా, ఇద్దరు చనిపోయారు. రాజస్థాన్‌లో 24 మంది కరోనా బారిన పడగా, గుజరాత్‌‌లో 23, మధ్యప్రదేశ్‌లో 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో ఒక్క కొవిడ్19 మరణం సైతం నమోదుకాలేదు.