స్టార్ హీరో విక్రమ్ తన కెరీర్లో నటించిన అరవయ్యో సినిమా ‘మహాన్’. ఈ సినిమాలో ఆయన తన కొడుకు ధృవ్‌తో కలిసి నటించారు. ఈ క్రేజీ మల్టీస్టారర్ విడుదల కోసం తమిళ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. అయితే థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పట్లో కరోనా కేసులు తగ్గి సాధారణ స్థితి వచ్చేలా కనిపించకపోవడంతో ఆ సినిమాను ఓటీటీలోనే విడుదల చేయాలని నిర్ణయించారు. అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 10న సినిమాను విడుదలచేయనున్నట్టు ప్రకటించారు. తమిళంతో పాటూ తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. 


మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో...
ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో తండ్రీకొడుకులు ఏ పాత్రలు పోషించారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విక్రమ్ కు తమిళంలోనే కాదు తెలుగులో కూడా అభిమానులున్నారు. ఆయన సినిమాలు తెలుగులో బాగానే మార్కెట్ అవుతాయి. ఇప్పుడు కొడుకుతో కలిసి చేసిన సినిమా కాబట్టి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించే అవకాశం చాలా ఎక్కువ. ఈ సినిమా విక్రమ్ కెరీర్ లో తొలిసారి ఓటీటీలో విడుదలవుతోంది. ఈ సినిమాలో సిమ్రన్, బాబీసింహా కూడా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ గా చేసింది కార్తీక్ సుబ్బరాజు. 






Also Read: నాన్నకు ప్రేమతో రిషి.. జగతిని ఇంటికి తీసుకొస్తాడా, మధ్యలో వసు రాయబారమా .. గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్
Also Read:  మోనిత కొడుకు కోసం కార్తీక్-దీప తాపత్రయం, నెల రోజులు గడువిచ్చిన రుద్రాణి.. కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి