Trinayani Serial Today September 10th Episode నయని, విశాల్‌, గాయత్రీ పాపలు మణికాంత గిరిలోని మానసా దేవి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ నీటి దీపం చివరకు వచ్చిందని ఆ దీపం వెలిగితేనే భుజంగమణి దొరుకుతుందని మాటలు వినిపిస్తాయి. ఆ సారి దీపం వెలిగించాలంటే చాలా కష్టమని వాయిస్ వినిపిస్తుంది. మానసా దేవి ధరించిన 7 మణుల్లో ఒక జ్వాలామణి ఉందని దాన్ని తాకితే దీపం వెలుగుతుందని అంటుంది. అయితే మూడు అవకాశాలే ఉన్నాయని ఆ మణిని గుర్తించకపోతే ముగ్గురి ప్రాణాలు పోతాయని వినిపిస్తుంది. 


మానసాదేవి విగ్రహం చాలా పెద్దగా ఉండటం అక్కడికి చేరుకొని మణి చూడటం కష్టమని నయని ఏడుస్తుంది. ఇంతలో చిలుక శివ అక్కడికి వస్తుంది. జ్వాలా మణి గురించి నయని చిలుకకు చెప్తుంది. ఆ మణి నేను తాకుతానని ఏ మణి తాకాలో మీరే చెప్పండని చిలుక అంటుంది. నయని చెప్తుంది చిలుక శివ మణిని తాకుతుంటుంది. మొదటి రెండు మణులను తాకగా దీపం వెలగదు. చివరి అవకాశం అని నయని ఏడుస్తుంది. అది పోతే ఇక ముగ్గురి ప్రాణాలు పోతాయని చాలా ఏడుస్తుంది. మరణం ఖాయం అని విశాల్ అంటాడు. ప్రయత్నించింది నేను కాబట్టి ఆ శిక్ష నాకే అని నేను పిట్టని కాబట్టి ఉంటే ఎంత పోతే ఎంత అని చిలుక అంటుంది. దాంతో నయని, విశాల్ ఇద్దరూ ఏ మణి తాకాలో చెప్పలేకపోతారు. శివని లి చేయడం ఇష్టం లేదని ఏడుస్తారు. 


ఇంతలో గాయత్రీ పాప మానసాదేవి అమ్మవారి ఎడమ చేతికి ఉన్న మణిని తాకమని చూపిస్తుంది. విశాల్ మనసులో మా అమ్మ జ్వాలా మణిని చూపించిందని అనుకుంటాడు. చిలుక శివ ఆ మణిని తాకగానే మొత్తం వెలుగులు మయం అవుతుంది. నీటి దీపం పెద్దగా వెలిగి మొత్తం కాంతి వస్తుంది. నయని, విశాల్, చిలుక అందరూ చాలా సంతోషిస్తారు. శివని బతికించినందుకు నయని గాయత్రీ పాపకి థ్యాంక్స్ చెప్తుంది. ఇక భుజంగ మణి ధగధగ మెరుస్తూ ఉండటాన్ని చూస్తారు. నయని ఆ భుజంగ మణి దగ్గరకు వెళ్తుంది. భుజంగ మణిని తీసుకొని వచ్చి విశాల్ కుడి చేతకి తాకిస్తుంది. దాంతో చేతికి ఆ కాంతి చేరి చచ్చుబడిపోయిన విశాల్ చేయి ఎప్పటిలా మారిపోతుంది. చలనం వస్తుంది. 



నయని భుజంగ మణి అక్కడ పెట్టేస్తా అని అంటే మళ్లీ వాయిస్ వినిపిస్తుంది. వచ్చే విజయ దశమిలో పంచకమణితో కలిపి భుజంగమణి ఇక్కడ పెట్టకపోతే నీ వంశం నిర్వీర్యం అవుతుందని వినిపిస్తుంది. నయని విశాల్ షాక్ అయిపోతారు. నయని సరే అంటుంది. ఇక ఉదయం ఇంట్లో అందరూ నయని, విశాల్ వాళ్ల రాక కోసం ఎదురు చూస్తుంటారు. ఇక తిరిగి రారు అని సుమన నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. విక్రాంత్ తిడతాడు. అన్నావదినలు సక్రమంగా తిరిగి వస్తున్నాడని అంటాడు. గజగండ ఇంకా రాలేదు కదా అని వల్లభ అంటే మీరే గజగండని ఫాలో అవ్వ మన్నారా అని హాసిని అంటుంది. 


ఇంతలో గాయత్రీ పాప ఇంటికి వస్తుంది. హాసిని సందడి సందడి చేస్తుంది. పిల్ల వచ్చింది తల్లీ తండ్రీ రాలేదని దురంధర అంటే సుమన వాళ్లు రారేమో అని అంటుంది. ఇంతలో నయని వస్తుంది. అందరూ విశాల్ గురించి అడుగుతారు. ఇక విశాల్ హీరో హీరోలా చేతులు ఊపుకొని ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. వల్లభ, సుమన, తిలోత్తమ ముఖాలు మాడిపోతాయి. మిగతా అందరూ సంతోషిస్తారు. వచ్చింది బావ గారేనా అని సుమన అంటే నేను గజగండని అని విశాల్ అంటాడు. విక్రాంత్ జోక్ అని అంటాడు.  ఇక సుమన వాళ్లు భుజంగ మణి గురించి అడుతారు. నయని మాతో పాటే తీసుకొచ్చామని చెప్తారు. విశాల్ అందరికీ భుజంగమణిని చూపిస్తాడు. సుమన పట్టుకొని చూస్తా అంటే నయని ఆపేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: సుమిత్ర ఇంట్లో కాశీ పెళ్లి రచ్చ.. తగులుకున్న స్వప్న, పారులు.. నిజం తెలిస్తే ఇక అంతే!