Trinayani Serial Today Episode వరసగా హారతి ఆరిపోవడంతో ఏదో జరగబోతుందని నయని అంటుంది. ఏం జరగబోతుందో నయనీకి తెలుసని తిలోత్తమ అంటుంది. దాంతో తెలిస్తే చెప్పకుండా ఉంటానా అని నయని అడుగుతుంది. దాంతో తిలోత్తమ నువ్వు కావాలని దాస్తున్నావేమో అని అంటుంది. ఇంటిళ్లపాది ఎవరికి వారే నాకు ఆపద వస్తుందంటే నాకు వస్తుందేమో అని టెన్షన్ పడతారు. 


విశాల్: దయచేసి మీ అందరూ ఒక్క నిమిషం మాట్లాడకుండా ఉంటారా. నయని నువ్వు చెప్పు ఏం జరుగుతుంది. ఎందుకు అందరూ నిన్ను తాలా ఓ మాట అనే వరకు ఆగిపోతున్నావ్.
నయని: నాకు తెలిస్తే చెప్పనా బాబుగారు. 
విశాల్: నయని నాకు తెలుసు కానీ నీకు ఏదో తెలిసే చెప్పడం లేదని అనుకుంటున్నారుగా.
విక్రాంత్: వదినా పోనీ ఒకసారి మా కోసం కళ్లు మూసుకొని చూడు ఏమైనా తెలుస్తుందేమో.
తిలోత్తమ: ఒక్క సారి చూడు నయని.
హాసిని: అనుకోగానే అయిపోడానికి ఇది మ్యాజిక్ కాదు.


నయని గాయత్రీ  దేవి ఫొటో వైపు చూస్తుంటుంది. అందరూ సైలెంట్ అయిపోతారు. నయని గాయత్రీ దేవి ఫొటో చూస్తూ దగ్గరకు వెళ్లి రాబోయే ఆపద నాకు ముందే తెలుస్తుంది కానీ ఈ సారి తెలీడం లేదు ఏంటది ఏమై ఉంటుంది నాకు తెలియాలి నేను తెలుసుకోవాలి అమ్మగారు అని కళ్లు మూసుకుంటున్నాను నాకు కనిపించేలా చేయండని కోరుకుంటుంది. దాతో నయని ఫొటోకి దండ వేసి దీపం పెట్టినట్లు కనిపిస్తుంది. నయని బిత్తర పోతుంది. షాక్‌తో కళ్లలో నీరు తిప్పుకొని వెనక్కి వాలిపోతుంది. అందరూ ఏమైందని అడిగి రిలాక్స్ అవ్వమని అంటారు.


తిలోత్తమ: ఎవరికి ఆపదో తనకు తెలిసినట్లుంది.
వల్లభ: అంత కంగారు పడుతుంది అంటే ఆపద మనకు కాదు అని అర్థమవుతుంది మమ్మీ.
హాసిని: మీరు కాస్త ఊరుకుంటే నేను చెల్లితో మాట్లాడుతా. చెల్లి ఇలా చూడు కంగారు పడకు. ఏమైంది.
నయని: ఏడుస్తూ ఏదో జరగబోతుంది. ప్రాణగండం పొంచి ఉంది బాబుగారు. మృత్యువు వెంటాడుతోంది. మరణం తపప్పదని అనిపిస్తుంది. 
విక్రాంత్: ఎవరికి వదినా.
నయని: నేను లేకపోతే నా బాబుగారిని నా పిల్లల్ని నా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు. ఆపద ఏ రూపంలో వస్తుందో తెలీదు కానీ ప్రాణం గండం ఉంది నాకే. 
వల్లభ: హమ్మాయ్య మనం బతికి పోయాం.
హాసిని: మీ ముఖం చెల్లి బతికి ఉంటేనే మనం బతికి ఉంటాం.
దురంధర: అవునే నాకు ఓ డౌట్ నయనికి కానీ తన బిడ్డలకు కానీ ఆపద వస్తే నయనికి తెలీదు కదా. 
విశాల్: నయని కరెక్టే కదా.
నయని: అవును బాబుగారు నాకు తెలీకూడదు కదా. 
హాసిని: మరి లాజిక్ మిస్ అవుతుంది కదా.
విశాల్: నయని నిన్ను ఒత్తిడి చేసినందుకు ఇలా అనిపించుంటుంది బీ కూల్ పద.


రాత్రి సుమన ఆస్తులు ఎన్ని ఉన్నాయని అంచనా కోసం రాసుకుంటుంది. విక్రాంత్ ఎందుకని అడిగితే మా అక్క పేరుతో ఎంత ఆస్తి ఉందో బావగారితో కలిసి ఎంత సంపాదించిందో అని అక్క చనిపోతే ఆస్తి దక్కించుకోవచ్చని అంటుంది. విక్రాంత్ సుమనను ఇష్టమొచ్చినట్లు తిడతాడు. పేపర్లను చింపేస్తాడు. మరోవైపు నయని విశాల్ ఒడిలో పడుకొని ఉంటే విశాల్ ధైర్యం చెప్తాడు. దాని గురించి ఆలోచించొద్దని అంటాడు. ప్రమాదం ఎలా వస్తుందో అని నయని అంటే నీకు కచ్చితంగా తెలుస్తుందని అంటాడు. ఇక నయని నేను ఉన్నా లేకపోయినా మన బిడ్డల కోసం మీరు ఉండాలని నయని విశాల్‌తో చెప్తుంది. నయని ప్లీజ్ ఇలా మాట్లాడకని విశాల్ చెప్తాడు. మనద్దరం కలిసే ఉంటామని అంటాడు. మరోవైపు తిలోత్తమ నయని జాతకం ఉన్న పేపర్‌ని  చూస్తుందని నయనికి ప్రాణ గండం ఉందని చెప్పిందని అందుకే చూస్తున్నా అని అంటుంది. ఇంతలో హాసిని అక్కడికి వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: వరసగా అదే అపశకునం.. నయనికి కనిపించని భవిష్యత్.. అసలేం జరుగుతోంది?