Trinayani Today Episode విశాలాక్షి ఇంట్లో ఏం జరిగిందో మొత్తం  చెప్పేస్తుంది. ఇక వల్లభ దురంధరకు ఏమైందో చెప్తే కాళ్లు పట్టుకుంటానని అంటాడు. దానికి డమ్మక్క అమ్మ కాలు మొక్కాల్సింది నువ్వు కాదు సుమన అని అంటుంది. సుమన  ఛీ.. ఛీ ఆ పిల్ల కాలు నేను పట్టడం ఏంటని మాట్లాడుతుంది. ఏం చెప్తుందో ఏంటో అని దురంధర మనసులో అనుకుంటుంది. విశాలాక్షి నవ్వుతుంది. అందరూ చెప్పమని అంటారు.


విశాలాక్షి తన అడ్డంగా ఊపితే వల్లభ సుమనలు విశాలాక్షి మీద సెటైర్లు వేస్తారు. కొన్ని విషయాలు తెలుసుకొని వచ్చి చెప్పి బిల్డప్‌ ఇస్తున్నారని అంటారు. తనని ఏమైనా అను కానీ అమ్మని అంటే కళ్లుపోతాయని డమ్మక్క అంటుంది. పోయావి కదా కాళ్లు అని సుమనని విశాలాక్షి అంటుంది. ఒకసారి నీ కాళ్లకు ఏమైందో నీకు తెలీకపోయినా నాకు తెలుసని ఒకసారి చూసుకో అని అంటుంది. సుమన కాళ్లు చూసే సరికి పెద్దబొట్టమ్మ శాపం వల్ల నల్లగా మారిపోతాయి. సుమన మంట పెడుతున్నాయని కుయ్యోముర్రో అనుకుంటుంది. ఏమాయ చేశావని సుమన విశాలాక్షిని ప్రశ్నిస్తుంది.


విశాల్: సుమన విశాలాక్షి ఏం చేయలేదు. పెద్దబొట్టమ్మ శాపం వల్ల ఇలా అయింది.
హాసిని: పెద్ద వాళ్ల శాపం ఊరికే పోదు.
నయని: విశాలాక్షి నువ్వే ఏదో దాని చూపించాలమ్మా.
డమ్మక్క: అమ్మ కాళ్లకు మీ చెల్లి దండం పెడితే సరిపోతుంది.
సుమన: చచ్చినా నేను ఆ పని చేయను. 


సుమన మంట అని అరుస్తుంది. తన గదికి వెళ్లి నీటిలో కాళ్లు పెట్టుకొని మంట మంట అని బాధ పడుతుంది. విక్రాంత్ వెటకారంగా సుమన కాళ్లకు ఫొటో తీస్తాడు. అందరూ విశాలాక్షి పేరు తలచుకోమని అంటారు. సుమన మాత్రం ఆ పని చేయను అంటుంది. అందరూ సుమనను బలవంతంగా తీసుకెళ్తారు. 


హాల్లో ఉన్న తిలోత్తమకు ఏదో శక్తి ఆవహించడంతో కరెంట్ షాక్ కొట్టినట్లు అయిపోతుంది. కింద కూర్చొని ధ్యానం చేస్తుంటే వల్లభ వచ్చి సోఫామీద కూర్చొకుండా కింద కూర్చొన్నావ్ ఏంటి మమ్మీ అని అడుగుతాడు. వల్లభ నీరు ఇవ్వడంతో సీరియస్‌గా చూస్తూ గ్లాస్ విసిరి కొడుతుంది. ఇక సుమనను అందరూ తీసుకొని వస్తారు. ఇక సుమన విశాలాక్షి ఏమైనా దేవతా శాపవిమోచనం కలిగించడానికి అని  అంటుంది. ఇక తిలోత్తమ మగ గొంతుతో అవును అని అరుస్తుంది. అందరూ బిత్తరపోతారు. వల్లభ మమ్మీ అని అంటే ఏవడ్రా మమ్మీ అని అంటుంది. 


విశాల్ అమ్మ అని పిలిస్తే తిలోత్తమ మగ గొంతుతో మీ అమ్మీ నాకు ప్రధాన శత్రువని అంటుంది. అందరి మీద మగ గొంతుతో అరుస్తుంది. తను తిలోత్తమ  అత్తయ్య కాదు అని నయని అంటుంది. ఆ మగ గొంతు కూడా తెలుసని అంటుంది. దాంతో డమ్మక్క నీకు బాగా తెలిసిన గొంతే అని అంటుంది. ఇక తన తల్లి వస్తే నీకు సుమనకు విముక్తి కలుగుతుందని అంటుంది డమ్మక్క. ఎవరొస్తారో రమ్మని అని తిలోత్తమ పిలుస్తుంది. ఇక విశాలాక్షి గండరఖడ్గం తీసుకొని వస్తుంది. ఎవర్ని నరుకుతుందని దురంధర అంటుంది. విశాలాక్షి వస్తుంటే తిలోత్తమ రావొద్దని అరుస్తుంది. తిలోత్తమ వల్లభను తోసేస్తే విశాలాక్షి వల్లభ మీద అడుగు పెట్టి వస్తుంది. విశాలాక్షి అమ్మవారిలా కనిపిస్తుందని ఆపలేను అని నయని అంటుంది. ఇక అందరూ సుమనను విశాలాక్షి పాదాల మీద పడమని అంటారు. దాంతో సుమన విశాలాక్షి పాదాల మీద పడి శరణు వేడుతుంది. విశాలాక్షి కత్తితో తిలోత్తమ చేతి గ్లౌజ్ తొలగిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్కీ, జున్ను ప్లాన్‌కి లక్ష్మీ అరవిందకు దొరికిపోయిందా.. వీడియో మేటర్‌లో మనీషాకు పెద్ద షాక్!