Trinayani September 9th Written Update: ఈరోజు ఎపిసోడ్ లో వరలక్ష్మీ వ్రతానికి ఇంట్లో అందరూ సిద్ధమవుతారు.అందరూ లలిత కోసం ఎదురుచూస్తారు.


తిలోత్తమ: లలితక్క వచ్చేముందు మీరు గొడవపడితే ఆవిడ తిట్టిపోతుంది. 


మరోవైపు లలిత బయట వరలక్ష్మి విగ్రహాన్ని చూసి దండం పెట్టుకుంటుంది.


లలిత: అమ్మా వరలక్ష్మి ,పూజలో కొలువై ఉండవలసిన దానివి ఇక్కడ ఉన్నావంటమ్మా. అని అంటుంది. ఇంతలో అక్కడికి విశాలాక్షి వస్తుంది.


విశాలాక్షి: వరలక్ష్మి తానుగా రాలేదమ్మా. నయని ఇంట్లో వరలక్ష్మిని దొంగలించారు అని శివయ్య నన్ను వెళ్ళమని పురమాయించారమ్మ .


లలిత: ఆ శివయ్య ఎవరో కానీ మంచి పని చేశారు. రా తల్లి విగ్రహాన్ని తీసుకొని ఇంట్లోకి వెళ్దాం.


విశాలాక్షి: వద్దమ్మా వరలక్ష్మిని సంరక్షణ చేసే అంత సమయం లేదు. ఇంట్లోనేమో అమ్మ వాళ్ళు శుభముహూర్తంలో పూజ మొదలు పెట్టాలనుకుంటున్నారు.


లలిత: మరి విగ్రహం లేకుండా పూజ ఎలా చేస్తారు. అని అంటుంది.


 మరోవైపు హాల్లో పూజ కోసమని అందరూ లలిత కోసం ఎదురు చూస్తారు.


నయని: శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం చేద్దాము అని మీ అందరిని కంగారు పెట్టేసాను.


హాసిని: ఏం పర్లేదు చెల్లి, ఇలాంటి పూజలు చేస్తే పాపిష్టి మొగుడిని కట్టుకున్నాను అన్న బాధ, పాపాత్మురాలు అయిన అత్తకి కోడలు అయ్యాను అన్న బాధ తగ్గిపోతాయి.


తిలోత్తమ: ఏయ్! అంత పాపం ఏం చేశామే?


డమ్మక్క: మీకు తెలుసు కదమ్మా. వాళ్లని ఎందుకు అడుగుతారు.


వల్లభ: పెద్దమ్మ వచ్చింది. అని అనగా అందరూ లలిత వైపు చూస్తారు. అప్పుడే లలిత లోపలికి వస్తుంది.


నయిని: మిమ్మల్ని చూడడం మాకు పండగలా ఉంటుంది అమ్మగారు.


లలిత: సంతోషం. ఏంటి తిలోత్తమా అలా చూస్తున్నావు.


హాసిని: వంటి నిండా నగలు వేశారు కదా పెద్ద అత్తయ్య. కళ్ళు వాటి మీద పడ్డాయేమో. 


తిలోత్తమ: వరలక్ష్మి దేవిని చూడాలా మిమ్మల్ని చూడాలని ఆలోచిస్తున్నాను. అని అనగా లలిత సిగ్గుపడుతుంది.


లలిత: శాపగ్రస్తుడైన విశాల్ ని చూడకముందే అమ్మవారిని చూద్దామనుకున్నాను.


విక్రాంత్: మరెందుకు ఆలస్యం. వదిన అమ్మవారి పైన ఉన్న ఆ వస్త్రాన్ని తీయండి. అని అనగా హాసిని, నయనీలు అమ్మవారి మీద ఉన్న వస్త్రాన్ని తీస్తారు. తీరా తీయగా అక్కడ విశాలాక్షి కూర్చుని ఉంటుంది. దానికి అందరూ ఆశ్చర్యపోతారు. వరలక్ష్మి ఉండాలి కదా విశాలాక్షి ఉందేంటి అని అనుకుంటారు నయని, హాసినిలు.


వల్లభ: మమ్మీ కాస్త ఏం జరుగుతుందో చెప్పవా.


తిలోత్తమ: విగ్రహం ఉండాల్సిన చోటులో విశాలాక్షి, అమ్మవారి వేషంలో కూర్చుని ఉందిరా.


విక్రాంత్: మరి ఆ విగ్రహం ఎక్కడుంది?


లలిత: బయట ఉంది. అని అనగా దానికి అందరూ ఆశ్చర్యపోతారు.


నయని: అమ్మవారి విగ్రహం బయట ఉండడమేంటి.


హాసిని: మేమే కదా స్వయంగా అమ్మవారిని అలంకరించి అక్కడ పెట్టాము. దిష్టి తగలకుండా గుడ్డ కప్పారేమో అనుకున్నాము. అని అంటుంది. విగ్రహం ఎవరు బయటపెట్టారు అని అడిగేలోగా,


విశాలాక్షి: వారా వీరా అని నిందలు వేస్తున్నారు. మరి పూజలు ఎవరు చేస్తారు?


తిలోత్తమ: అలాగని ఇప్పుడు నీకు పూజలు చేస్తామా?


లలిత: చేస్తే తప్పేంటి?చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం తిననే అమ్మవారు అనుకుని పూజ చేద్దాము. లక్ష్మీదేవి, పార్వతి దేవి, విశాలాక్షి దేవి అందరూ ఒకటే పూజ మొదలుపెడదాము.


సుమను: అలాగని ఎవరికి పడితే వాళ్లకి పూజ చేయడం ఏంటి? ఐ డోంట్ కేర్. అని అక్కడ నుంచి వెళ్ళిపోదామని చూస్తుంది.


లలిత: ఇక్కడి నుంచి కదిలితే కాళ్లు ఇరక్కొడతాను. పూజ అయ్యేంతవరకు ఇక్కడ నుంచి ఒక్క మనిషి కూడా వెళ్లే ప్రసక్తే లేదు. ఇక పూజ మొదలు పెడతాము.


విశాలాక్షి: మీ చెల్లెలి సవతికి ఏదో అభ్యంతరం ఉన్నట్టు ఉంది.


తిలోత్తమ: తప్పు చేస్తున్నావేమో అక్క. పూజ చేయాలి కానీ మరి వయసు, ఎవరో ఏంటో అనేది కూడా చూడాలి కదా.


లలిత: మనం పూజ చేస్తుంది సాక్షాత్తు అమ్మవారికి అని విశాలాక్షి దేవిని వర్ణిస్తూ ఉంటుంది లలిత.


విక్రాంత్: పెద్దమ్మ అంత చెప్పాక కూడా పూజ ఆలస్యం దేనికి మొదలుపెడతాము.


సుమన: మిమ్మల్ని ఎదురిస్తున్నాను అని అనుకోవద్దు అత్తయ్య కానీ ఇంతగా రెడీ అయింది అమ్మవారి విగ్రహం లేకుండా పూజ చేయడానికి కాదు. నేను వెళుతున్నాను.


విశాలాక్షి: ఎక్కడికి వెళ్తున్నావు సుమన? నువ్వు వెళ్లాలనుకున్నా కదల లేవు. ఇంత అందంగా వచ్చిన దానివి అందమంతా పోయి వెళ్లలేవు కదా.


సుమన: నా అందం ఎక్కడికి పోతుంది? ఇన్ని నగలు వేసుకున్నాను కదా.


డమ్మక్క: వేసుకున్నవి నగలు అనుకుంటుంది. కానీ అది పాము అని అనగా సుమన మెడ లోకి ఒక పాము వచ్చి చుట్టుకుంటుంది. ఒకేసారి దాన్ని చూసి అందరూ ఉలుక్కు పడతారు.


విక్రాంత్: ఇప్పుడు కదులు. ఒక్కడుగు వేస్తే పాము కాటుకి చస్తావు.


దురంధర: ఇంక ఎవరు ఇక్కడి నుంచి కదలరు. పూజ మొదలు పెడదాము.


నయని: అమ్మగారు అమ్మ వారి కీర్తన పాడండి అని లలితని అడుగుతుంది. లలిత కీర్తనలు పాడుతూ ఉండగా హాసిని, నయనీలు అమ్మవారికి పూజ చేసి హారతి ఇస్తారు. ఆ హారతిని అందరూ తీసుకుంటారు. 


హాసిని: అమ్మవారి విగ్రహం లేకపోయినా సరే పూజ చాలా బాగా అయింది.


సుమన: పూజ అయింది కదా ఇంక ఈ పాములు వెళ్ళిపోమని చెప్పరా అని భయపడుతూ అడుగుతుంది.


లలిత: పాము ఎక్కడుంది? నీ మెడలో నగలే కదా ఉన్నాయి అని అనగా సుమన మెడలో నుంచి పాము మాయమైపోతుంది.


సుమన: చెప్పానా ఈ గాయని విశాలాక్షి ఈ పని చేస్తుంది అని.


తిలోత్తమ: ఎలా వచ్చిందో కానీ వచ్చినప్పుడు నుంచి అందరినీ భయగ్రాంతులకు గురిచేస్తుంది.


విశాలాక్షి: భయం లేకుండా పాపపు పనులు చేస్తున్నప్పుడు బ్రాంతికి గురి చేస్తేనే మనిషి అదుపులో ఉంటాడు. లేకపోతే రాక్షస గుణాన్ని అలవర్చుకుంటాడు.


లలిత: అమ్మ విశాలాక్షి పూజకు ముందే అపశకునం జరిగింది అని లెంపలు వేసుకుంటుంది.


విశాలాక్షి: పర్వాలేదు అమ్మ మా వదిన లక్ష్మీదేవికి నేను చెప్పకుంటానులే.


వల్లభ: చూశారా ఈ పిల్ల పిచ్చిపిచ్చిగా ఎలా మాట్లాడుతుందో.


లలిత: నోరు ముయ్యు. ఎవరికి పరీక్ష పెట్టాలి అని విగ్రహాన్ని బయట కూర్చోబెట్టారు. అని అనగా ఆ మాటకి అందరూ ఆశ్చర్యపోతారు.


నయని: మీరేనా ఈ పనిచేసింది. అని కోపం తో అంటుంది.


హాసిని: త్రిశూలం ఇలా ఇవ్వండి పొడుచి పారేస్తాను.


విశాలాక్షి: పాపం, పరీక్షించబోయి తెల్లబోయారు.


తిలోత్తమ: మేమే చేసాము అని అలా ఎలా చెప్తున్నారు.


లలిత: మీరే చేశారు అని నాకు బాగా తెలుసు.


విశాలాక్షి: వద్దమ్మా వదిలేయండి.


తిరుత్తమా: సాక్షదారాలు లేకుండా మా మీద నింద వేయొద్దు. ఇలా ఆరోపిస్తే బాధేస్తుంది.


నయని: విశాలాక్షి అమ్మవారు కూర్చోవలసిన చోటులో నువ్వే కూర్చున్నావు కాబట్టి ఆ పని చేసిన వారిని నువ్వే క్షమించాలి. అని అనగా విశాలాక్షి ఒక శ్లోకం చదువుతుంది. అప్పుడు లలిత విశాలాక్షికి దండం పెట్టుకుంటుంది.


సుమన: మీరు అంత పెద్దవారు ఈ చిన్న పిల్లలకి మర్యాద ఇస్తూ దండం పెట్టుకుంటారు ఏంటి?


లలిత: ఆదిపరాశక్తి ముందు అందరూ చిన్నవాళ్ళమే. నిజమే తెలుసుకోలేని నీలాంటి వాళ్లు సత్యాన్ని ఏ గ్రహిస్తారు.


విశాలాక్షి: పూజ బ్రహ్మాండంగా చేశారు. మా వదిన ఇంటి బయటే ఉన్నా నన్ను ఇంట్లో ప్రతిష్టించి పూజ చేసినందుకు మీకు ప్రతిఫలంగా ఏమైనా ఇవ్వాలనుకుంటున్నాను. అడగండి అమ్మ.


నయని: మీ చల్లని చూపు ఉంటే చాలు అమ్మ.


డమ్మక్క: అమ్మ అడగమన్నప్పుడు అడగాలి నయని అని చెప్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.