Seethe Ramudi Katnam Serial Today Episode రామ్ సీత దగ్గరకు వచ్చి ఆషాఢం అయిపోయింది మా పిన్ని కూడా నిన్ను కోడలిగా ఒప్పుకుంది కదా ఇక కలిసిపోవాలని అంటాడు. దానికి సీత ముహూర్తం పెట్టే వరకు వెయిట్ చేయాలని అంటుంది. తమకి ఆషాఢంలో సాయం చేసిన వాళ్లకి థ్యాంక్స్ అని అనుకుంటారు. ఇక అందరూ హాల్లో ఉంటే శివకృష్ణ, లలిత అక్కడికి వచ్చి ఊరు వెళ్తున్నామని చెప్పడానికి వచ్చామని అంటారు. సీతని జాగ్రత్తగా చూసుకోమని తన తల్లిదండ్రులు చెప్తే చలపతి అది సుమతి నిలయం అని తర్వాత సీత నిలయం అవుతుందని అంటాడు. ఇక సీత ఈ ఇళ్లు ఎప్పటికీ సుమతి నిలయమే అని సుమతి అత్తమ్మ త్వరలోనే ఈ ఇంటికి వస్తుందని అంటుంది.


విద్యాదేవి: నేను ఇక్కడే ఉన్నాను కానీ మీరు గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాను.
అర్చన: సుమతి అక్క బతికి ఉండి కూడా ఈ ఇంటికి ఎందుకు రావడం లేదో అస్సలు అర్థం కావడం లేదు.
మహాలక్ష్మీ: అదే నాకు అర్థం కావడం లేదు సుమతి నిజంగానే బతికే ఉందా లేక ఈ శివకృష్ణ వాళ్లు నాటకం ఆడుతున్నారేమో అనిపిస్తుంది. ఇంటి దాకా వచ్చిన సుమతి ఇంట్లోకి ఎందుకు రాలేదు. 
విద్యాదేవి:  ఈ ఇంట్లో తనకు శత్రువులు ఎవరైనా ఉన్నారేమో.
మహాలక్ష్మీ: సుమతికి ఈ ఇంట్లో శత్రువులు ఉన్నారో లేక బయట ఎవరో సన్నిహితులు ఉన్నారేమో.
సీత: అంటే మీ ఉద్దేశం ఏంటి అత్తయ్య సుమతి అత్తయ్యకి మామయ్య, మామ, ప్రీతిలను మించి సన్నిహితులు ఎవరు ఉంటారు. 
మహాలక్ష్మీ: అంటే నేను అంటున్నది సుమతికి అక్రమ సంబంధం ఉందేమో అని. 
శివకృష్ణ: మహాలక్ష్మీ గారు. నా చెల్లి గురించి నీచంగా మాట్లాడుతున్నారు.
మహాలక్ష్మీ: నీచంగా కాదు నిజం మాట్లాడుతున్నా ఆ రోజు అందుకే సుమతి జనా వాళ్లని వదిలేసి వెళ్లిందేమో అందుకే తన కోసం మేం వెతక్కూడదని చనిపోయినట్లు నాటకం ఆడిందేమో.  
విద్యాదేవి: మనసులో ఎంత దారుణంగా మాట్లాడుతున్నావ్ మహాలక్ష్మీ.
మహాలక్ష్మీ: ఆ విషయం ఈ శివకృష్ణకు తెలుసేమో తెలిసే దాచిపెడుతున్నాడేమో.
శివకృష్ణ: ఆపండి మహాలక్ష్మీ గారు నా గురించి మా చెల్లి గురించి ఇలా మాట్లాడితే ఒప్పుకోను.
  
సుమతి మేనకోడళ్లే సీత, మధులని తెలిసి తమ దగ్గర మధు ప్రేమ విషయం దాచిపెట్టి సీతని పెళ్లి చేశారని అంటుంది. ఇక శివకృష్ణ లలితలు జనా, సీతలను నిలదీస్తారు. సుమతి మీద నిందలు వేస్తుంటే ఎందుకు కిమ్మనకుండా ఉన్నారని అడుగుతారు. మహాలక్ష్మీ శివకృష్ణతో నువ్వే సుమతిని చంపేశావ్ అని అంటుంది. శివకృష్ణ కోపంతో రగిలిపోతాడు. హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నావని అంటాడు. ఈ మాటలు సుమతి వింటే చంపేస్తుందని అని మహాలక్ష్మీ చంపేస్తానని శివకృష్ణ మహా దగ్గరకు వెళ్లి హార్ట్ ఎటాక్ వస్తుంది. అందరూ హడావుడిగా శివకృష్ణకి హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. తన వల్లే ఇదంతా అని విద్యాదేవి బాధ పడుతుంది. డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తూ బీపీ ఎక్కువైపోతుందని సుమతిని చూడాలి అంటున్నారని ఆమెని వెంటనే తీసుకొస్తేనే ఆయన ప్రాణాలకు ఇబ్బంది ఉండదని చెప్తారు. సీత, రామ్, లలితలు టెన్షన్ పడతారు. 


మరోవైపు అందరూ మహాలక్ష్మీ నిందలు వేసిందని కోప్పడతారు. విద్యాదేవి మాట్లాడితే మహాలక్ష్మీ తన ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దని అంటుంది. విద్యాదేవి జనాని నిలదీస్తుంది. సీత వచ్చి నీకు ఆశ్రయం ఇచ్చిన సుమతి గురించి ఇలా మాట్లాడటం దారుణం అని అంటుంది. గొడవ పెద్దదవడంతో జనార్థన్ గొడవ ఆపమని అంటాడు. ఇక సుమతిని చూడాలని శివకృష్ణ కలవరిస్తున్నాడని సీత చెప్తుంది. విద్యాదేవి కంగారు పడుతుంది. రామ్ కూడా మహాలక్ష్మీ మీద సీరియస్ అవుతాడు. మామయ్య బతకాలి అంటే సుమతి అమ్మ రావాలని అంటాడు. మామయ్యని కాపాడేది అమ్మ ఒక్కర్తే అని అంటాడు. సుమతి గురించి మామయ్య గురించి టీవీల్లో పేపర్లో వేయాలని రామ్ అంటాడు. ఇక విద్యాదేవి కచ్చితంగా అన్నయ్య దగ్గరకు వెళ్లాలని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్న కిడ్నాప్ విషయం తెలుసుకున్న మనీషా, దేవయాని.. మిత్రలా తల్లీకూతుళ్లతో మాట్లాడిన అర్జున్!