Satyabhama Today Episode నందిని వచ్చి తినడానికి కూర్చొంటే నేను వెళ్లి నిన్ను పిలవమని పంపిస్తే నీ దగ్గరకు వచ్చి ప్రేమగా పిలిస్తే తిట్టి పంపేశావ్ అందుకే తినకుండా లోపలికి వెళ్లి ఏడుస్తుందని భోజనానికి వచ్చిన హర్షతో విశాలాక్షి చెప్తుంది. వదిన ఎప్పుడు నీకు దగ్గర అవ్వాలని ప్రయత్నించినా నువ్వు ఇలాగే దూరం పెడుతున్నావు అన్నయ్య అని సంధ్య చెప్తుంది.


హర్ష: నేను ఏం కావాలి అని చేయలేదు. కేసు విషయంలో ప్రకాశ్ అంకుల్‌తో మాట్లాడుతుంటే ఆ టెన్షన్‌లో ఉన్నాను. వస్తాను అన్నా వినిపించుకోకుండా విసిగించింది.
విశాలాక్షి: నీ టెన్షన్ చూపించడానికి కాదురా భార్య ఉండేది. నీ భార్య నిన్ను అర్థం చేసుకోలేదు సరే నువ్వు తనని అర్థం చేసుకోవాలి కదా. మీ నాన్న నన్ను అర్థం చేసుకోలేదు. దూరంగా ఉంటున్నారు. నేను అరవడం లేదు కదా. బాధ దిగమింగుకొని ఉన్నాను కదా. మౌనంగా ఉంటున్నాను కదా.
శాంతమ్మ: ఇంకా అలాగే నిల్చొంటావ్ ఏంట్రా నందిని బతిమాలి తీసుకురా.
హర్ష: ఏదో చిరాకులో నీ మీద అరిచాను సారీ. ఇంకోసారి అలా చేయను. భోజనం చేయురా. అమ్మ కూడా నీ కోసం భోజనం చేయకుండా కూర్చొంది.
నందిని: నా మీద ప్రేమతో వచ్చావా మీ అమ్మ చెప్తే వచ్చావా. మీ అమ్మ చెప్తేనే వచ్చావ్ ఒప్పుకో. నువ్వు ఎంత బతిమాలినా రాను వెళ్లు విసిగించకు. నా ఖర్మ కాలి దొరికినావ్.
హర్ష: అది మొండిదమ్మా రాదు. నాకు ఆకలేస్తుంది వడ్డించమ్మా.
శాంతమ్మ: మొగుడు తినకుండా భార్య తినకూడదు అన్నాం ఇప్పుడు నువ్వు తింటే మమల్ని ఉంచుతుందా.


ఇక విశాలాక్షి హర్షకి జూస్ ఇచ్చి పంపిస్తుంది. హర్ష నందిని దగ్గరకు వెళ్లి జూస్ తాగమంటాడు. నందిని వద్దని అంటే క్షమాపణ చెప్పి నీలో మార్పునకు ఇంట్లో అందరూ సంతోషిస్తున్నారు. నాన్న కూడా బయటకు వచ్చేస్తే మనకు ఇక అంతా హ్యాపీనే అప్పుడు ఇక నా ఫోకస్ అంటా నీ మీదే అని ఇంకోసారి నిన్ను హనీమూన్‌కి తీసుకెళ్తాను. నువ్వు ఎక్కడికి అంటే అక్కడికి తీసుకెళ్తాను ఈ ఒక్క సారికి క్షమించని నందినికి జూస్ ఇస్తాడు. నందిని కూడా తీసుకుంటుంది. ఫస్ట్ నైట్‌లో పాలు షేర్ చేసుకోలేదు. ఇప్పుడు ఈ జ్యూస్ షేర్ చేసుకుందామా అంటే నందిని హర్ష మీదకు జూస్ విసిరేస్తుంది. హర్ష చాలా షాక్ అయిపోతాడు.


సత్య రెడీ అయి వచ్చి కోర్టుకి వెళ్దామని అంటే క్రిష్‌ నీకు నా మీద ఉంది కదా అని అంటాడు. ఉంది అని సత్య చెప్తే క్రిష్‌  సత్యని కోర్టుకి వెళ్లొద్దని అడ్డుకుంటాడు. సత్య క్రిష్‌తో మీ ఇంట్లో వాళ్ల మాటలకు మారిపోయావని నా పని నేను చేసుకుంటానని వెళ్లిపోతుంది. దాంతో క్రిష్‌ నేను మామయ్యని విడిపించడానికి సిద్ధపడి ఉన్నానని.. నువ్వు ఇంట్లో ఉంటే నేను కోర్టుకి వెళ్తానని అంటాడు. నువ్వు ఇప్పుడు రావడం వల్ల లేని పోని సమస్యలు వస్తాయని అంటాడు. సత్యని క్రిష్‌ ఒప్పిస్తాడు. ఇంతలో హర్ష సత్యకి కాల్ చేస్తాడు. దాంతో సత్య నేను రావడం లేదు అన్నయ్య బావగారు వస్తున్నారు. ఆయన మీద నాకు నమ్మకం ఉంది ఆయన నాన్నని విడిపిస్తారని అంటుంది. క్రిష్‌ లోపల మహదేవయ్య, భైరవిల దగ్గరకు వెళ్తాడు. ఇక సత్య ఇంట్లోనే ఉందని చెప్తాడు. దాంతో సత్య కంటే నీకు నీ తండ్రి అంటే ఎక్కువ ఇష్టమని భైరవి అంటుంది. మహదేవయ్య పొంగిపోతాడు. చిన్నా మీద నమ్మకం ఉంది కానీ చిన్న కోడలి మీద నమ్మకం లేదని సత్య మనసు మారేలోపు వియ్యంకుడికి శిక్ష పడేలా చేయాలని మహదేవయ్య భైరవితో చెప్తాడు.


సంధ్య, హర్షలు కోర్టుకు వెళ్తారు. విశ్వనాథాన్ని చూసి సంధ్య, హర్షలు ఎమోషనల్ అవుతారు. విశ్వనాథం పిల్లలతో నేను నా పిల్లల కోసం చేసిన మంచి పని ఇదే చివరి పని కూడా ఇదే అని అంటాడు. ఇక చుట్టూ చూసి సత్య గురించి వెతుకుతాడు. అది చూసి క్రిష్ ఎవరి కోసం వెతుకుతున్నారు మామయ్య, పిల్లలకు అన్యాయం చేస్తున్నారని గుండె నిండా ప్రేమను పెట్టుకొని ఆ ప్రేమను చంపుకుంటున్నారని అంటాడు. ఇంటిళ్ల పాది మీ కోసం ఏడుస్తున్నారని అంటాడు. విశ్వనాథం తన గురించి మర్చిపోమని అంటాడు. హర్షకి బాధ్యతలు అప్పగిస్తాడు. తనని బయటకు తీసుకు రావొద్దని అంటాడు. ఇక విశ్వనాథాన్ని పోలీసులు తీసుకెళ్లిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఇరుక్కుపోయిన మనీషా.. సంయుక్త కచ్చితంగా లక్ష్మీనే అన్న మిత్ర, ఆధారాలు చూపించిన వివేక్!