Prema Entha Madhuram Serial Today Episode: అభయ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి దొరికిందా? లేదా అని అటు ఇటూ తిరుగుతుంటాడు. ఇంతలో అకి, జెండే వస్తారు. తమకు నిద్రొస్తుందని వెళ్లిపోతుంటే.. ఆ అమ్మాయి గురించి ఏం చెప్పకుండా వెళ్తున్నారేంటి అని మనసులో అనుకుని అంతా ఓకే కదా అని అడుగుతాడు. దీంతో ఆ విషయం అడగడానికి ఇంతలా ఆలోచించాలా? అన్నయ్యా అంటూ అకి చెప్తుంది.


 శంకర్‌ గారు ప్రాణాలకు తెగించి మరీ వాళ్లందరినీ కాపాడాడు అని అకి చెప్పడంతో ఓహో ఇలాంటి మంచి బుద్దులు కూడా ఉన్నాయన్నమాట. అని చెప్పగానే ఎప్పుడూ కాయిన్‌‌ కు ఒకవైపే చూడకూడదని జెండే చెప్తాడు. ఎవరినైనా అపార్థం చేసుకునే ముందు ఆలోచించాలి అంటాడు. ఇంతలో రాకేష్‌ వస్తాడు. నేను కూడా సోషల్‌ మీడియాలో చాలా మందికి తెలిసేలా చేశానని రాకేష్‌ చెప్తాడు. దీంతో అకి, జెండే ఇద్దరూ కలిసి రాకేష్‌‌ ను  వెటకారంగా మెచ్చుకుంటారు. మరోవైపు యాదగిరి తమ ఇంట్లో పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటాడు.


జ్యోతి: ఏవండి..


యాదగిరి: మొత్తం 316.. నువ్వు నన్ను తోరణం కట్టకుండా ఆపింది 316 సార్లు.


జ్యోతి: చాలు కానీ ముందు వెళ్లి అన్నయ్య వాళ్లు ఎక్కడున్నారో..


యాదగిరి: ఇప్పుడు అంటే అన్నావు కానీ అందరి ముందు అన్నయ్యా, వదిన అని వాళ్లను పిలవకు.


జ్యోతి: సరే లేండి ముందు వెళ్లి అన్నయ్య, వదిన, అకి లకు ఫోన్‌ చేయండి.


 అని చెప్పడంతో యాదగిరి బయటకు వెళ్లి శంకర్‌‌ కు ఫోన్‌ చేస్తాడు. శంకర్‌ సంప్రదాయంగా రెడీ అయి ఉంటాడు. శంకర్‌ ను చూసిన ఇద్దరు తమ్ముళ్లు షాక్‌ అవుతారు. ఇంతలో శంకర్‌ తమ్ముళ్లు కూడా రెడీ అయి వస్తారు. గౌరి కూడా సంప్రదాయంగా చీర కట్టుకుని రెడీ అయి వస్తారు. గౌరిని చూసిన శంకర్‌ షాక్ అవుతాడు. శ్రావణి, సంధ్య కూడా సాంప్రదాయంగా రెడీ అయి రావడంతో పెద్దొడు, చిన్నొడు షాక్‌ అవుతారు. ముగ్గురు అక్కా చెల్లెల్లను ముగ్గురు అన్నదమ్ములు తన్మయత్వంతో చూస్తుంటారు.


శంకర్‌: ఏట్రా అలా చూస్తున్నారు టైం అయిపోతుంది వెళ్దాం పదండి భోజనాలు అయిపోతాయి అక్కడ.


పెద్దోడు: ఏదోలా నేను శ్రావణి పక్కన నడవాలి. ( అని మనసులో అనుకుని శ్రావణి పక్కకు వెళ్తాడు.) అరేయ్‌ ఈ ఇంట్లో శ్రీనివాస్‌ గారు ఉండాలి ఉన్నారా?


చిన్నొడు: వాళ్లు ఖాలీ చేసి సంవత్సరం అయిందిరా.. భలే తెలివిగా శ్రావణి పక్కన చేరాడు. ఇప్పుడు సంధ్య పక్కకు నేనెలా వెళ్లాలి. (అని మనసులో అనుకుంటాడు)



సంధ్య: వీళ్లిద్దరూ పక్కప్కకు వచ్చేశారే చిన్నొడిని కూడా నా పక్కకు రప్పిచుకోవాలి.. ఇప్పుడేం చేయాలి ( అని మనసులో అనుకుంటుంది.) శ్రావణి ఇది మన ఫ్రెండ్‌ మల్లికా హౌస్ గుర్తుందా?


 అంటూ చిన్నొడి పక్కకు వెళ్తుంది సంధ్య. మూడు జంటలు కలిసి రావడం చూసిన యాదగిరి సంతోషంగా లోపల ఉన్న అకి,  జ్యోతిలను పిలుస్తాడు. అటు చూడండి అని శంకర్‌, గౌరీలను చూపిస్తాడు. మూడు జంటలను చూసిన జ్యోతి, అకి హ్యాపీగా ఫీలవుతారు.


జ్యోతి: అన్నయ్య వదిన ఎంత ముచ్చటగా ఉన్నారు చూడండి.


యాదగిరి: అవును మనసుకు చాలా తృప్తిగా అనిపిస్తుంది. మొన్నటి వరకు నువ్వోవరో నేనేవరో అన్నట్లు గొడవ పడ్డారు. ఒక సమస్య వచ్చిందో లేదో ఒకరికి ఒకరు తోడుగా నిలబడి ఇదిగో ఇవాళ ఇలా కలిసిపోయారు.


 అంటూ వాళ్లిద్దరూ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని అలా కలసి ఉండాలంటే మనమే ఇవాళే ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంటారు అకి, జ్యోతి. ఇంతలో శంకర్‌, గౌరీలకు ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ:  ‘జగధాత్రి’ సీరియల్‌: జిమ్ ఓపెన్ చేసిన యువరాజ్ – జిమ్ లో ప్రొటిన్ పౌడర్ డబ్బాలో డ్రగ్స్ పెట్టిన టోని