Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర పెళ్లి కొడుకుగా రెడీ అవుతాడు. లక్ష్మీ అలియాస్ సంయుక్త మిత్ర నుదిటిన బాసిటం కడుతుంది. ఇక లక్ష్మీ గురించి మిత్రని అడుగుతుంది. లక్ష్మీ తనని మోసం చేసిందని తను బతికి ఉన్నా క్షమించనని మిత్ర అంటాడు. 


సంయుక్త: లక్ష్మీ తప్పు చేసిందని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా. మీ మాటలను బట్టి చూస్తుంటే లక్ష్మీ బతికే ఉందని మీరు నమ్ముతున్నారని అర్థమవుతుంది. మనసులో ఒకరిని ఉంచుకొని మరొకరి మనసులో తాళి కట్టడం కరెక్టేనా. మీరు అనుకున్నట్లు లక్ష్మీ తప్పు చేసిందే అనుకో మరి మీరు చేస్తుందేంటి.
మిత్ర: నేను ఈ పెళ్లి చేసుకుంటున్నది లక్కీ కోసం. ఈ పెళ్లి వల్ల నేను పొందబోయేది ఏం లేదు. 
సంయుక్త: నష్టపోయేది కూడా ఏం లేదా. ఈ పెళ్లితో ఏం లాభం లేదు అంటున్నారు నష్టం కూడా లేదా అని అడుగుతున్నాను.
మిత్ర: ఈ పెళ్లి వల్ల లక్కీకి మంచి అమ్మ దొరుకుతుంది. 
సంయుక్త: ఈ పెళ్లి జరిగితే మీరు లక్ష్మీకి శాశ్వతంగా దూరం అయిపోతారు కదా. 
మిత్ర: అది ఆలోచించుకోవాల్సింది లక్ష్మీ నేను కాదు. 
సంయుక్త: మిమల్ని కాపాడిన లక్ష్మీని మీరు మర్చిపోయారా. సగం నిజం మిగతా సగం నిజం కాదేమో అని మీకు మీ మనసు చెప్పడం లేదా. అది అబద్ధం అయింటుందని అనిపించడం లేదా. ఈ పెళ్లి మీరు లక్కీ కోసం చేసుకుంటున్నారు సరే మరి లక్ష్మీ సంగతేంటి. ఇదంతా నేను మీరు మీ బంధానికి ఇవ్వబోయే విలువ కోసం చెప్తున్నా. మిత్ర గారు పొందేది ఏమీ లేనప్పుడు పోగొట్టుకునేది చాలా ఎక్కువ ఉంటుంది. అది వ్యాపారం అయినా జీవితం అయినా. అని చెప్పి సంయుక్త వెళ్లబోతే తన చీర కొంగు మిత్ర బ్రేస్‌లేట్‌కి అంటుకుంటుంది.


మిత్ర దాన్ని తీయడంతో సంయుక్త వెళ్లిపోతుంది. వివేక్ ఆ మాటలు విని మిత్ర దగ్గరకు వస్తాడు. లక్ష్మీ వదినను నువ్వు ఇంకా మర్చిపోలేదని అంటాడు. ఇప్పుడు ఆ టాపిక్ అవసరం లేదని మిత్ర ఆపేస్తాడు. మరోవైపు దేవయాని మనీషాని రెడీ చేస్తుంటుంది. జాను సంయుక్త దగ్గరకు వెళ్లి అక్క ఎప్పుడు సంయుక్తలా ఉన్న నువ్వు ఈ రోజు లక్ష్మీలా ఎందుకు రెడీ అయ్యావని ఇదే చివరి సారిగా లక్ష్మీగా చనిపోతున్నావని అంటుంది. మిత్రకు జరగబోయే ఈ పెళ్లి లక్ష్మీగా నిన్ను చంపేస్తాయని అంటుంది. అందరి నోరు మూయించేసిన నీకు ఇక కన్నీళ్లే గతి అని జాను అంటుంది. లక్ష్మీ చాలా ఏడుస్తుంది. అరవింద కూడా ఇక నీకు కనీళ్లే గతి అని అంటుంది. అరవింద కొంగు చాచి నువ్వు నా కొడుకు కలిసి ఉండాలని అడుగుతుంది. దానికి లక్ష్మీ మీరు నన్ను అడుగుతుంది నా జీవితాన్ని కాదు మీ శాపాన్ని అడుగుతున్నారని ఏడుస్తుంది. నిన్ను కాపాడటానికి ఏ దేవుడు ఏ రూపంలో వస్తాడే అని అరవింద ఏడుస్తుంది. 


అరవింద కోపంగా అక్షితలు తీసుకొచ్చి వాటిని లక్ష్మీ నెత్తిన వేసి చంపేద్దామని ఆవేశంగా అరుస్తుంది. నిజం తెలియని మిత్ర, నిజం తెలిసిన మనం అందరం హంతకులు అయిపోదామని అంటుంది. ఇక వివేక్ మిత్ర కూడా లక్ష్మీ గురించి బాధ పడుతున్నాడని చెప్తుంది. దానికి లక్ష్మీ మిత్రకి నేను ఇష్టంగా గుర్తు లేదని కోపంతో గుర్తున్నానని అంటుంది. ఎలా అయినా పెళ్లి ఆపమని జాను లక్ష్మీని ప్రాధేయపడుతుంది. మరోవైపు లక్ష్మీ పెళ్లి ఆపుతుందా అని మనీషా టెన్షన్ పడుతుంది. దానికి దేవయాని అందర్ని సెట్ చేశావని నువ్వు తప్ప ఇంకెవరూ ఈ పెళ్లిని ఆపలేరని దేవయాని అంటుంది. మరోవైపు జున్ను లక్కీతో మనీషా ఆంటీ నీకు అమ్మగా ఓకేనా తను నిన్ను సరిగా చూసుకోదని అంటాడు. ఇక లక్కీ తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని జున్నుతో చెప్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: గ్రానీని అడిగి నిజం నిర్ధారించుకున్న జ్యోత్స్న ఇప్పుడేం చేయనుంది.. అసలైన ఆట ఇప్పుడు మొదలైందా!