Prema Entha Madhuram  Serial Today Episode:  గౌరి పెళ్లికి ఒప్పుకుందని రాకేష్‌, పాండు వినయ్‌ పార్టీ చేసుకుంటారు. పాండుకు రాకేష్‌ డబ్బులు ఇస్తాడు. అమ్మాయి తనకు బాగా నచ్చిందని వినయ్‌ సంబరపడిపోతుంటాడు. మరోవైపు జెంటే, యాదగిరి, అకి, రవి ఒక దగ్గర ఆగి ఆలోచిస్తుంటారు.


రవి: పైకి చెప్పడం లేదు కానీ అకి చాలా బాధపడుతుంది సార్‌.


యాదగిరి: ఆ బాధ తనకే కాదురా? మా అందరికీ ఉంది. తన తండ్రి స్థానంలోకి వేరే ఎవరో వస్తున్నారు అంటే అకి పాపకు బాధ ఉండదా?


రవి: బాధపడుతూ కూర్చుంటే సమస్య పరిష్కారం కాదు కదా నాన్న. ఎందుకు అత్తయ్యకు మామయ్యకు అసలు నిజం చెప్పి వాళ్లను ఒక్కటి చేయకూడదు.


యాదగిరి: చాల్ల నోరు మూయ్‌. మాకు తెలియక మేము ఊరుకుంటున్నామా? విధి ప్రకారం ఏది జరగాలో అది జరగాలి.


జెండె: యాదగిరి ఎందుకు అలా కోప్పడుతున్నావు. తనేదో మన బాధ చూడలేక చెప్తున్నాడు. అసలు విషయం చెప్తే సరిపోతుంది కదా?


రవి: వివరంగా చెప్పే ఉద్దేశం ఆయనకు ఎప్పుడూ ఉండదు సార్‌.


యాదగిరి: అను మేడం ఆర్యవర్ధన్‌ సార్‌ గురించి తెలుసుకోవాలంటే కూడా ఒక అర్హత ఉండాలి. వాళ్ల గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు.


 అంటూ ఇద్దరూ గొడవ పడతారు. దీంతో అకి  యాదగిరి ఊరుకోండని చెప్తుంది. ఇంతలో యాదగిరి వీడు ఎప్పుడైన వాళ్లకు నిజం చెప్తాడు. అని భయపడతాడు. ఇంతలో జెండే ఆగు అంటూ ఆర్య  గొప్పదనం గురించి చెప్తాడు. దీంతో మనం మౌనంగా ఉంటే ఎలా మనం ప్రయత్నిస్తే విధి కూడా వాళ్లను కలపొచ్చు కదా అంటాడు రవి. మరోవైపు శంకర్‌ ఒక్కడే నిలబడి ఆలోచిస్తుంటాడు. గౌరి అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు. వినయ్‌ మాటలు గుర్తొస్తుంటాయి. ఇంతలో తమ్ముళ్లు వచ్చి భోజనం చేద్దాం అని పిలుస్తారు. ఆకలిగా లేదని ఆ పెళ్లికొడుకును చూస్తూంటే ఏదో అనుమానంగా ఉందని చెప్తాడు శంకర్. వాడేదో జైలు నుంచి పారిపోయి వచ్చినట్టు ఉన్నాడని చెప్తాడు. వాడి డీటెయిల్స్‌ మొత్తం తెలుసుకోవాలని.. ఆపరేషన్‌ పెళ్లికొడుకు స్టార్ట్‌ అంటాడు. తమ్ముళ్లు కూడా ఓకే అంటారు. తర్వాత శ్రావణి, సంధ్య, గౌరి దగ్గరకు వెళ్తారు.



గౌరి: ఏంటే నాతో ఏదైనా చెప్పాలా?


శ్రావణి: ఏం లేదు అక్కా పెళ్లి కాకుండా అతనొచ్చి మన ఇంట్లో ఉండటం అంటే అంత బాగోదేమో..


సంధ్య: చుట్టు పక్కల వాళ్లు తప్పుగా అనుకుంటే మనమే కదా అక్కా బాధపడేది.


గౌరి: అతను వచ్చి ఉండటం నాకు ఇష్టం లేదనుకోండి. కానీ..


 శ్రావణి: నువ్వు శంకర్‌ గారి మీద కోపంతో ఆయన్ని ఇక్కడ ఉండమన్నావని నాకు తెలుసు అక్కా.. కానీ నువ్వు ఆవేశపడకుండా ఒక్కసారి ఆలోచించాల్సింది.


గౌరి: కరక్టే కానీ ఒకే చెప్పేశాకా ఇప్పుడు రావొద్దంటే ఇప్పుడు బాగోదేమో..?


శ్రావణి: నువ్వేం చెప్పొద్దక్కా ఫోన్‌ చేసి మేము చెప్పుకుంటాములే ఆయన అర్థం చేసుకుంటారులే


అని చెప్తుండగానే బయట కారు పాండు, వినయ్‌ వస్తారు. వాళ్లను చూసిన సంధ్య అక్క మనము ఫోన్‌ చేసే లోపే వాళ్లు వచ్చేశారు. అని చెప్తుంది. ఇంట్లోకి వెళ్తున్న వినయ్‌, పాండుకు శంకర్‌ వాళ్ల తమ్ముళ్లు ఎదురు రావడంతో పాండు ఇరిటేటింగ్‌ గా ఫీలవుతాడు. గౌరి వచ్చి శంకర్‌ వాళ్లను తిడుతుంది. మరోవైపు యాదగిరి, జ్యోతి గొడవ పడుతుంటే అకి వస్తుంది. మీరేంటి గొడవ పడుతున్నారు అని అడుగుతుంది. మాకు ఇది రోజు ఉండేదేలే అని చెప్తారు. ఎంటిలా వచ్చావని అడగ్గానే రవి ఫోన్‌ తీయడం లేదని అందుకే వచ్చానని చెప్తుంది అకి. యాదగిరి రవిని తిడుతుంటే మామయ్య తిట్టకుండా ఏదైనా ప్రేమగా చెప్పండి అంటుంది. దీంతో పైకి వెళ్లి ప్రేమగా రవిని పలకరిస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: అదృష్టాన్ని తీసుకొచ్చే పుట్టుమచ్చలు, శరీరంపై ఎక్కడ ఉంటే ఏం ప్రయోజనమో తెలుసా?