Prema Entha Madhuram  Serial Today Episode:  శంకర్‌, యాదగిరి కలిసి గౌరి కోసం వెతుకుతుంటారు. మరోవైపు బిల్డింగ్‌ పైకి వెళ్లిన గౌరి వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటుంది. ఇంతలో రాకేష్‌ ముసుగు వేసుకుని వస్తాడు. దీంతో గౌరి  ఎవరు నువ్వు అని అడుగుతుంది. దీంతో రాకేష్‌ నీ చావును అంటూ భయపెడతాడు. ఎవరు నువ్వు నన్నెందుకు చంపాలనుకుంటున్నావు. అని అడగ్గానే నువ్వు గౌరివి కాదు మిస్సెస్‌ అనురాధ ఆర్యవర్థన్‌ అంటూ మీ చావు మా నాన్న చేతుల్లోనే కాదు నా చేతుల్లో కూడా రాసి పెట్టి ఉంది అని గౌరిని చంపబోతుంటే.. రాకేష్ ను తోసేసి గౌరి పారిపోతుంది. మరోవైపు అదే బిల్డింగ్‌ దగ్గరకు వచ్చిన శంకర్‌ తనకు గౌరి ఏదో ప్రమాదంలో ఉన్నట్లు అనిపించిందని యాదగిరికి చెప్తాడు. అవునని యాదగిరి అంటాడు.


యాదగిరి: సర్‌ మీరు మరోక్కసారి గౌరి గారికి ఫోన్‌ చేయండి.


శంకర్‌: అవును బాబాయ్‌ చేస్తాను ఉండు.


 శంకర్‌ ఫోన్‌ చేసినా గౌరి ఫోన్‌ లిఫ్ట్‌ చేయదు.


యాదగిరి: సార్‌ ఒకసారి పోలీస్‌ స్టేసన్‌ కు ఫోన్‌ చేసి గౌరి మేడం నెంబర్‌ ను ట్రేస్‌ చేయమని చెప్పండి. మొన్న మీరు అమ్మాయిల కిడ్నాప్‌ విషయంలో హెల్ఫ్ చేశారు కదా?


శంకర్‌: మంచి ఐడియా ఇచ్చావు బాబాయ్‌.  ( పోలీస్‌ కు ఫోన్‌ చేస్తాడు.) సార్‌ నమస్తే నేను శంకర్‌ ను అదే మొన్న  అమ్మాయిల కిడ్నాప్‌ విషయంలో సాయం చేశాను చూడండి  ఆ శంకర్‌ ను


పోలీస్: ఆ శంకర్‌ నువ్వా.. చెప్పు ఎలా ఉన్నావు.


శంకర్‌: నేను బాగున్నానండి. ఏవండి నాకు ఒక చిన్న సాయం కావాలి. అందుకే మీకిప్పుడు ఫోన్‌ చేశాను.    


పోలీస్‌: ఏంటో చెప్పు శంకర్‌.


 అనగానే శంకర్‌, గౌరి విషయం చెప్పి తన ఫోన్‌ ట్రేస్‌ చేయాలని అడుగుతాడు. పోలీస్‌ సరే అంటాడు.  గౌరి ఫోన్‌ ట్రేస్ చేసి నార్సింగ్‌ ఏరియాలో కన్‌స్ట్రక్షన్‌ దగ్గర ఉందని చెప్పగానే నేను ఇక్కడే ఉన్నాను సార్‌ అనగానే అయితే నీ నెంబర్‌ కూడా ట్రేస్‌ చేస్తాను అని నువ్వు ఉన్న దగ్గరే రెండో బిల్డింగ్‌ లో గౌరి ఉందని చెప్తాడు. దీంతో శంకర్‌ ఆ బిల్డింగ్‌ వైపు వెళ్తాడు. మరోవైపు రాకేష్‌  గౌరిని కత్తితో పొడిచి చంపబోతుంటే శంకర్‌ వచ్చి అడ్డుకుంటాడు. శంకర్‌ చూసిన గౌరి శంకర్‌ గారు అంటూ పిలుస్తుంది. శంకర్‌, గౌరిలను ఒకేసారి చంపేస్తానని.. గత జన్మలో నీ పెళ్లాం మా నాన్న చేతిలో చచ్చిపోయింది. అన్న బాధలో చనిపోయావు ఇప్పుడు నీ భార్యను బతికించుకోవడానికి వచ్చి నా చేతుల్లోనే చావబోతున్నావు. అంటూ కత్తితో వాళ్ల వైపు పరుగెత్తగానే


శంకర్‌: చావు ఎలా ఉంటుందో మీ నాన్న నా చేతుల్లో ఏన్నోసార్లు రుచి చూశాడు. వాడి కొడుకువి నువ్వెంత. 


 అంటూ ఆర్యవర్థన్‌ పూనినట్టు మాట్లాడి రాకేష్‌ ను కొడతాడు. దీంతో రాకేష్‌ పారిపోతాడు. గౌరిని ఎందుకు ఇక్కడకు వచ్చావు అని అడగ్గానే జరిగింది మొత్తం చెప్తుంది గౌరి. తర్వాత శంకర్‌ కోపంగా పాండును తిడతాడు. తర్వాత యాదగిరి అక్కడ జరిగిందంతా జెండేకు ఫోన్‌ చేసి చెప్తాడు. జలంధర్‌ కొడుక్కి ఆర్య సార్‌, అను మేడం మళ్లీ పుట్టారని వాడికి తెలిసిపోయిందని అలాగే సార్‌కు మేడం కు కూడా గతజన్మ గురించి తెలిసినట్లుంది అని చెప్తాడు. మరోవైపు గౌరి, శంకర్‌ లు త్వరలోనే ఇల్లు ఖాళీ చేసి పారిపోతారు. ముందు ఇతను రాగానే నాకు రావాల్సిన పేమెంట్‌ తీసుకోవాలి అనుకంటుంటాడు. ఇంతలో రాకేష్‌ కంగారుగా పరుగెత్తుకొస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ఇంట్లో బల్లులతో విసిగిపోయారా? ఇలా చేయండి బల్లులన్నీ పరార్