Prema Entha Madhuram  Serial Today Episode: అభయ్‌ కోపంగా కిందకు వచ్చి అలాంటి ఫ్రాడ్స్‌ ను నువ్వు  పదేపదే నమ్మకు అని అకికి చెప్తాడు. అయితే నిజం తెలిసిన రోజు నువ్వు చాలా బాధపడతావు అని అకి, అభయ్‌కి చెప్తుంది. రాకేష్‌ ఎవరి కోసమో మీరు గొడవ పడటం ఏంటని అభయ్‌‌ కు చెప్తాడు. దీంతో జెండే మీరు ఏదో పని మీద బయటకు వెళ్తున్నట్లున్నారు వెళ్లండి అని చెప్పగానే మీ గారాభం వల్లే తను ఇలా తయారైందని అభయ్‌ వెళ్లిపోతాడు. మరోవైపు యాదగిరి గేటు దగ్గర గౌరి, శంకర్‌ ల కోసం ఎదురుచూస్తుంటాడు. ఇంతలో గౌరి, శంకర్‌ వస్తారు.


పెద్దోడు: అన్నయ్యా వెళ్లిన పని ఏమైంది. చెక్‌ ఇచ్చారా?


శంకర్‌: ఇచ్చార్రా.. ఇదిగో బ్యాంకు వెల్లి క్యాష్‌ కూడా తీసుకున్నాం.


చిన్నోడు: నువ్వు సూపర్‌ అన్నయ్యా..


శ్రావణి: మా అక్క వెళ్లింది కాబట్టి సక్సెస్‌ అయ్యింది.


శంకర్‌: మొదలెట్టేసిందిరా భజన చేయడం. అవునమ్మా మీ అక్కను చూడగానే రామ్మా వరలక్ష్మీ అని పిలిచి భజన చేసి చెక్కు చేతిలో పెట్టేశారు.


యాదగిరి: శంకర్‌ సార్‌ ఒకసారి పక్కకు వస్తారా?


శంకర్‌: ఏంటి బాబాయ్‌ పక్కకు తీసుకొచ్చావు.


యాదగిరి: ఏం లేదు సార్‌ మీరు అక్కడ ఇంకెవరినైనా కలిశారా? అదే అభయ్‌ బాబును కలిశారా?


 అని అడగ్గానే లేదని మమ్మల్ని చూడగానే ఆయన పక్కనుంచే వెళ్లిపోయాడు. అని చెప్పగానే యాదగిరి డిసప్పాయింట్‌ అవుతాడు. ఇంతలో మళ్లీ గౌరి, శంకర్‌ లు గొడవ పడతారు. మనీ మ్యాటర్‌ అయిపోయిందిగా ఇక ఒకర్ని ఒకరం కలవకూడదని విడిపోతారు. దీంతో ఇద్దరు కలవడానికి ఏం చేయాలి అని ఆలోచించి వెంటనే జోగమ్మను కలిసి పరిష్కారం అడగాలి అని యాదగిరి జోగమ్మను వెతుక్కుంటూ వెళ్తాడు.


యాదగిరి: అమ్మా మీరు అమ్మవారి స్వరూపం. మీకు తెలియనిది అంటూ ఏదీ ఉండదు. సారూ మేడం జన్మలు దాటుకుని వాళ్ల ప్రేమకు మళ్లీ ప్రాణం పోసుకున్నారు. అనురాధ, ఆర్యవర్థన్‌ లుగా వాళ్లు పొందలేని ప్రశాంతమైన జీవితాన్ని గౌరి, శంకర్‌‌ లు గానైనా పొందుతారని ఆశపడితే వాళ్లు పూర్తిగా విడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.


జోగమ్మ:  అన్ని ముందే తెలిసిపోతే ఇక దేవుడు మనతో ఆడే జీవితం అనే ఆటకు అర్థం ఏముంది.


యాదగిరి: అంటే అమ్మా నేను చెప్పేది..


 అని యాదగిరి చెప్పబోతుంటే జోగమ్మ నమ్మకం ఉన్నచోట భయం ఉండకూడదు. కంటికి కనిపించేదే నిజం అనుకోకూడదని చెప్తుంది. వాళ్ల జీవితంలో గొప్ప మలుపు, మంచి జరగబోతున్నాయి అని చెప్తుంది. మరోవైపు అభయ్‌, రాకేష్‌ తో కలిసి యాప్‌ గురించి మాట్లాడుకుంటూ వెళ్తుంటాడు. ఇంతలో రాకేష్‌ కు జగ్గుబాయ్‌ కాల్‌ చేస్తాడు.


రాకేష్‌: హలో చెప్పండి బాయ్‌ ఎలా ఉన్నారు.


జగ్గుబాయ్‌: పెద్ద ప్రాబ్లమ్‌ లో చిక్కుకున్నాను రాకేష్‌. నీ హెల్ప్‌ కోసం ఫోన్ చేశాను.


రాకేష్‌: దందాకు సంబందించిన పనులైతే నేను ఇప్పుడవి పూర్తిగా మానేశాను బాయ్‌. ఇప్పుడు నా తండ్రి చావుకు కారణమైన వాళ్ల మీద పగ తీర్చుకునే పనిలో ఉన్నాను.


 అనగానే జగ్గుబాయ్‌ నువ్వు అక్కడ ఏం చేస్తున్నావో నాకు తెలుసు. నా దగ్గర కోట్లు విలువ చేసే సరుకు ఉంది. దాన్ని నువ్వు సిటీ దాటించాలని చెప్తాడు. సరే ఇద్దరం కలిసే మాట్లాడుకుందాం అని రాకేష్‌ జగ్గుబాయ్‌ దగ్గరకు వెళ్లబోతుంటే ఇంతలో అభయ్‌ వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావని అడగ్గానే పాత మిత్రుడు సిటీకి వచ్చాడంట హెల్ఫ్ అడిగితే వెళ్తున్నాను అని చెప్పి రాకేష్‌ వెళ్లిపోతాడు.


    మరోవైపు టీవీలో అమ్మాయిల కిడ్నాప్‌ న్యూస్‌ చూసి గౌరి టెన్షన్‌ పడుతుంది. సంధ్య బయటకు షాపు కు వెళ్లిందని తెలుసుకుని భయంతో వెతుక్కుంటూ గౌరి వెళ్లిపోతుంది. మరోవైపు శంకర్‌ తన తమ్ముళ్లతో గౌరి గురించి గొప్పగా చెప్తుంటాడు. షాపు దగ్గరకు వెళ్లి సంధ్య గురించి అడుగుతుంది. షాప్పు అతను అరగంట క్రితమే వచ్చి వెళ్లిందని చెప్పడంతో గౌరి షాక్‌ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ: అందుకే నా జాతకం చెప్ప‌లేదేమో, వేణు స్వామిపై నారా రోహిత్ పంచ్