Podharillu Serial Today Episode: పాము,ముంగిస అంటూ మహా, కన్నా ఏడిపించడంతో కేశవ్ అసలు విషయం చెప్పేస్తాడు. అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా  తనకు తెలియదని..కస్టమర్‌ బైక్‌ స్కూటీతో ఢీకొట్టి పాడుచేస్తే....20వేల రూపాయలు కట్టమన్నానని చెబుతాడు.ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో తన ఫోన్ లాక్కున్నానని అంటాడు. అందుకే ఆ ఫోన్‌ కోసం ఆ అమ్మాయి రకరకాల నాటకాలు వేస్తుందని చెప్పేస్తాడు. ఇది ఏమాత్రం నమ్మశక్యంగా లేదని మహా, కన్నా అంటారు.

Continues below advertisement

అయితే ఆ అమ్మాయి ఫోన్‌లో మైలవ్‌ అని ఎందుకు సేవ్‌ చేసుకుని ఉందని అడుగుతారు. దీంతో కేశవ్‌ కన్నాకు  ఒక్కటిచ్చి...అరే ఆ అమ్మాయి ఫోన్‌లో వాళ్ల నాన్న నెంబర్‌ మైలవ్‌ అని సేవ్‌ చేసుకుందని...ఇంటి దగ్గర నుంచి వాళ్ల  నాన్న ఫోన్‌తో ఫోన్ చేస్తుంటే...మై లవ్ అని గాక ఇక ఏం వస్తుందని మండిపడతాడు. అదేదో నా ఫోన్‌లో సేవ్‌ చేసుకున్నట్లు చెబుతావేంటిరా అని అంటాడు. ఆ అమ్మాయి ఫోన్‌లో తన ఇష్టం వచ్చినట్లు సేవ్‌ చేసుకుంటే నాకు ఏంటి సంబంధం అంటాడు. ఈ వ్యవహారం ఏంటో నేను తేలుస్తానులే అని చక్రి అంటాడు. అబద్ధాలకోరు వాడు చెప్పినవి నమ్ముతారుగానీ చిన్నప్పటి నుంచి అసలు అబద్ధం చెప్పని నేను ఎందుకు చెబుతానని కేశవ్ అంటాడు. దీంతో పెద్ది సరేనని అంటాడు. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందామని అంటాడు.                           

కాలేజీలో సర్టిఫికేట్లకు అప్లై చేయడం కోసం మహా యాదగిరిగుట్ట వెళ్తానని చెప్పడంతో  ఇంట్లో అందరూ భయపడతారు. వద్దని చెబుతారు...కానీ మహా వెళ్తానని అంటుంది. అయితే చక్రి నేను తోడుగా వస్తానంటే వద్దని అంటుంది. కేశవ్‌, పెద్ది కూడా నిన్ను ఒంటరిగా పంపడం ఇష్టం లేదని చెబుతారు. అక్కడ మీ నాన్న, అన్నయ్య, భూషణ్ ఉంటారని వాళ్లతో నీకు ఏదైనా ఇబ్బంది రావొచ్చని అంటారు. గతంలో ఇలా నమ్మి వెళ్లినందుకే  నీ సర్టిఫికేట్లు కాల్చివేయడంతోపాటు.....నిన్ను శాశ్వతంగా అక్కడే ఉంచాలని చూశారని భయపడతారు. ఖచ్చితంగా మాలో ఎవరో  ఒకరు తోడుగా వస్తామని చెబుతారు. ఇలా నన్ను ఒంటరిగా ఎక్కడికి పంపించకుండా పంజరంలో బంధించడం వల్లే నాకు లోకం అంటే ఏంటో తెలియకుండాపోయిందని మహా అంటుంది. ఇంటి  నుంచి బయటకు వచ్చేప్పుడు సర్టిఫికేట్లు, ఆధార్‌కార్డు తెచ్చుకోవడం కూడా తెలియలేదని అంటుంది.ఇలా ఎవరో ఒకరిపై ఆధారపడుతూనే ఉంటే...ఇక నేను సొంతంగా ఎప్పుడు ఎదగగలననని అంటుంది. దీంతో మాధవ్‌ సరేనంటాడు. కానీ చక్రి మాత్రం బస్సులో వద్దని, కారు తెప్పిస్తానని కారు తెప్పిస్తాడు. అందరూ కలిసి మహాను కారులో యాదరిగుట్టకు పంపిస్తారు.              

Continues below advertisement

మహా యాదరిగుట్టకు ఒంటరిగా వెళ్తుందని తెలుసుకున్న ఆదినారాయణ...మార్గమధ్యలో కారును అడ్డగిస్తాడు. ఆయన్ను చూడగానే భయపడిపోయిన మహా కారు ఆపొద్దని చెప్పినా ...నారాయణ కారుకు అడ్డుగా నిలవడంతో డ్రైవర్‌ ఆపుతాడు. డ్రైవర్‌ మెడపై కత్తిపెట్టి డోరు తెరిపిస్తాడు నారాయణ. తను కూడా మహాతోపాటు యాదగిరిగుట్టకు బయలుదేరతాడు. నేను ఎవరినీ వద్దని చెప్పాను కదా మీరు ఎందుకు వస్తున్నారని అనగా...నేను నీకోసం రావడం లేదని చెప్పి కారులో వస్తాడు. నారాయణ చేతిలో ఉన్న కత్తిచూసి భయపడిపోయిన మహా..మాధవ్‌కు ఫోన్‌చేసి చెబుతుంది. నాన్న ఎందుకు వచ్చారని అడగ్గా....కారు ఆపి కత్తితో బెదిరించి ఎక్కారని మహా చెబుతుంది. ఆయన్ను చూసి  ఏం భయపడొద్దని...ఎలాంటి ఇబ్బంది కలిగించడని నేను చూసుకుంటానని చెబుతాడు.